మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 8 : మినీట్యాంక్బం డ్, శిల్పారామం పనులను వేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను ఎక్సైజ్, క్రీ డా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. సోమవా రం ఉదయం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ వ ద్ద చేపట్టిన సస్పెన్షన్ బ్రిడ్జి, రోడ్డు, శిల్పారామం పనుల ను మంత్రి తనిఖీ చేశారు. వర్షం కారణంగా సస్పెన్షన్ బ్రిడ్జి, రోడ్డు, ఇతర పనులు నిలిచిపోయాయని డీఈ మ నోహర్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ బ్రిడ్జిలకు అవసరమైన స్లాబుల ను పూర్తి చేయాలని సూచించారు. ఆదే విధంగా నక్లెస్రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో మట్టితో నింపితే మొక్కలు నాటేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అధికారులు పనులపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు పను ల్లో నాణ్యతతో జాప్యం లేకుండా చేపట్టాలని ఆదేశించారు. అంతకు ముందు రామయ్యబౌళిలో అలుగు, నాలాను పరిశీలించారు. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, అధికారులు ఉన్నారు.
పోరాట యోధుడు పండుగ సాయన్న..
మహబూబ్నగర్ రూరల్, ఆగస్టు 8 : మహబూబ్నగర్ పేదల కోసం పోరాడిన గొప్ప యోధుడు పండుగ సాయన్న అని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణాలర్పించిన గొప్ప మహనీయుడు ఆయనన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో ని వీరన్నపేటలో పండుగ సాయన్న ఆలయంలో 131 వ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ వీరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ధనవంతులతో పోరాడి పేదలకు సాయం చేసిన ఆయన్ను స్మరించుకోవడం గర్వంగా ఉందన్నారు. సా యన్న ఖ్యాతిని మరింతగా పెంచే బాధ్యత తమపై ఉంద న్నారు. వందేండ్లకు పూర్వమే ధనవంతుల దురహంకారానికి పేదలు గురికాకుండా వారి కో సం ప్రాణాలర్పించిన వ్యక్తి అ ని అన్నారు. ఆయన పేరు మీ ద ఆలయం, విగ్రహావిష్కరణ చేయడం అభినందనీయమన్నారు. ఉమ్మడి జిల్లాలో పం డుగ సాయన్న, నాగన్న, మి యాసాబు వంటి వీరుల చరిత్రలు ఉన్నాయని తెలిపారు. వాటన్నింటినీ శాఖాపరంగా తీ సి ప్రజలకు తెలియజేస్తామ న్నారు. సాయన్న కుటుంబీకులకు, ఆయన సమాధిని కాపాడిన దళితులకు డబుల్ బె డ్రూం ఇండ్లు ఇచ్చామన్నారు. అనంతరం సాయన్న మ నుమండ్లు నర్సింహులు, యాదయ్యను మంత్రి సత్కరించారు. న్యాయవాది బెక్కం జనార్దన్, సాయన్నపై రాసిన ‘పాలమూరు వీరుడు పండుగ సాయన్న’ సంక్షి ప్త జీవిత చరిత్రను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, డైరెక్టర్ వెంకన్న ముదిరాజ్, నాయకులు, ముదిరాజ్లు పాల్గొన్నారు.