మహబూబ్నగర్, ఆగస్టు 7 : మనిషి మనుగడకు కులవృత్తులు ఎంతో సహకారం అందిస్తూ వచ్చాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేతకు గౌరవం తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేతినిండా పని దొరకడంతోపాటు రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. అగ్గి పెట్టెలో పట్టే సైజ్లో ఆనాడే చీరను తయారు చేసిన మహానేర్పరి చేనేత కార్మికులని కొనియాడారు.
సీఎం కేసీఆర్ నేతన్నల శ్రమను గుర్తించి వారికి అండగా ఉండేందుకుగాను పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. గద్వాల, నారాయణపేట, కొత్తకోట, కోటకొండ చేనేత చీరలు, గొంగళ్లు, ఇతర చేనేత వస్ర్తాలు అన్ని ఒకే చోట లభించేలా జిల్లా కే్ంర దంలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నారాయణపేటలో చేనేతకు స్థలం కేటాయించామన్నారు. అనంతరం శ్రీలక్ష్మీ వేంకటేశ్వర చేనేత సహకార జాతీయ సంఘానికి రూ.12,38,960 విలువైన పావు లా వడ్డీ చెక్కును మంత్రి అందజేశారు. చేనేత దుస్తులతో దేశ నాయకుల వేషధారణలో ఉన్న విద్యార్థులతో మంత్రి ఫొటోలు దిగారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.
ప్రత్యేకంగా జెండాలను ఏర్పాటు చేయాలి
స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న జెండా పండుగ రోజులను ఘనంగా నిర్వహించుకుందామని మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మహబూబ్నగర్ అధికారులతో నేరుగా, నారాయణపేట జిల్లా అధికారులతో వీసీలో 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో పెద్దగా ఉండేలా జాతీయ జెండాను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఖోఖో, కబడ్డీ, క్రికెట్, లాంగ్జంప్ తదితర పోటీలను నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి పంద్రాగస్టున బహుమతులను ప్రదానం చేయాలని ఆదేశించా రు. ఇప్పటికే క్రికెట్ కిట్లను గ్రామాలకు అం దించామన్నారు. నిర్లక్ష్యం లేకుం డా పకడ్బందీగా జెండా పండుగను నిర్వహించుకుందామని సూచించారు. ష టిల్ కిట్లను 15 వ తేదీన గ్రామాల్లో, పట్టణాల్లో యువతకు అందేలా చూడాలన్నారు.
9న జాతీయ పతాకాల పంపిణీ, 10న వనమహోత్సవంలో మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు, 11న ఫ్రీడం రన్, 12న జాతీయ సమైక్యత రక్షాబంధన్, 13న విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్, ప్రభుత్వ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించాలన్నారు. త్రివర్ణ బెలూన్లను అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో ఎగురవేయాలని కోరారు. 14, 15న జిల్లా, నియోజకవర్గ స్థాయిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, 16న రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపాన చేయాలని, 17న రక్తదాన శిబిరాల ఏర్పాటు, 18న ఫ్రీడం పేరుతో క్రీడాపోటీలు, 19న దవాఖానలు, వృద్ధాశ్రమాల వద్ద పండ్ల పంపిణీ, 20న స్వయం సహాయక మహిళా సంఘాలతో రంగోళి పోటీలు, 21న జిల్లా, మండల, గ్రామ పంచాయతీలలో ప్రత్యేక సమావేశాల నిర్వహణ, 22న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందుకోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. 10న జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో కుండీలను ఏర్పాటు చేసి మొక్కలను నాటాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లా కేంద్రానికి లక్ష జాతీయ జెండాలు వచ్చాయని, మరిన్ని వస్తాయని మంత్రి దృష్టికి కలెక్టర్ వెంకట్రావు తీసుకొచ్చారు. అనంతరం జాతీయ జెండాలను కలెక్టర్, ఎస్పీ వెంకటేశ్వర్లతో కలిసి ఆవిష్కరించి మున్సిపల్ అధికారులకు అందజేశారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, డీఎస్పీ మహేశ్, చేనేత, జౌళీ శాఖ ఏడీ బాబు, డీఈవో రవీందర్, ఆర్డీవో అనీల్కుమార్, వెటర్నరీ జేడీ మధుసూదన్గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.