నారాయణపేట, ఆగస్టు 7 : నారాయణపేట బంగారానికి, చేనేత వస్ర్తాలకు ఎంతో ప్రసిద్ధి చెందిందని, అప్పటి ఘన చరిత్ర రానురాను మసకబారిందని, పేట చేనేతకు పూర్వ వైభవం తీసుకురావాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సింగారం చౌరస్తాలో నైపుణ్య శిక్ష ణా కేంద్రంలో చేనేత, జౌళి శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసి న కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చేనేత కార్మికులు చీరలే కాకుండా మగవారికి అనువైన వస్ర్తాలను తయారు చేయాలన్నారు. చేనేత రంగం కనుమరుగవుతున్న తరుణంలో ప్రభుత్వం చేనేతకు ప్రాధాన్య త ఇస్తూ వారి సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు.
అదేవిధంగా చేనేత ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్య త ఉందన్నారు. కలెక్టర్ సహకారంతో చేనేత సొసైటీ ఆస్తు లు అన్యాక్రాంతం కాకుండా చేనేత కార్మికులకే దక్కేలా చ ర్యలు తీసుకుంటున్నామన్నారు. ధన్వాడ మండలంలో డిజైనింగ్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని, పట్టణం లో రూ.6 కోట్లతో అత్యాధునిక పరిజ్ఞానంతో వీవర్స్ వీవిం గ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. నేతన్నకు చేయూత అందించాలన్న ఉద్దేశంతో చేనేత బీమాను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. చేనేత బీమా కోసం ప్రతి కార్మికుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ప్రతి కార్మికుడితో రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత అధికారులపై ఉందన్నారు.
డిమాండ్కు తగ్గ తయారు చేయాలి
కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్కు అనుగుణంగా చేనేత చీరలను ఉత్పత్తి చేయాలన్నారు. చేనే త కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులకు ఫొటోషూట్స్, డాక్యుమెంటరీ తయారు చేయడం జరుగుతుందని, దీంతో ఆయా ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందన్నారు. అరుణ్య బ్రాండ్తో కలంకారి, బ్లాక్ పెయింటింగ్, ఇతర రకాల డిజైన్లతో కూడిన చీరలను మార్కెటింగ్ చేయాలన్నారు. చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృ షి చేస్తుందన్నారు. కార్మికులు వాటిని సద్వినియోగం చేసు కోవాలని ఆమె సూచించారు.
వ్యాసరచన పోటీలు
ఈ సందర్భంగా చేనేత కార్మికులు చేసిన వీడియోను వీక్షించారు. అనంతరం చేనేత వస్ర్తాల వినియోగం వాటి ప్రాముఖ్యత అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేశారు. ప్రతిఒక్కరూ చేనేత వస్ర్తాలు ధరించి, చేనేత వృత్తిని కాపాడుకుందామని అధికారులు, చేనేత కార్మికులు, ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, ఆర్డీవో రాంచందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్ తదితరులు పాల్గొన్నారు.