మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 3: ప్రతి ఒక్కరిలోని ఆలోచనలకు ప దును పెట్టడమే కాకుండా సైన్స్పై ఆసక్తి పెంచి వారిలో సృజనాత్మకను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం 2022సంవత్సరానికి ఆవిష్కరణలకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సాధారణ జీవన విధానంలో తలెత్తే సమస్యలు. సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థానికంగా లభించే పరికరాలతో సరికొత్త వస్తువులను రూపొందించడానికి చేసే ప్రయత్నమే ఆవిష్కరణ. ఇందులో విద్యార్థులు మొదలు గృహిణులు, రైతులు, యువకులు ఇలా అన్నిరంగాల వారికి అవకాశం కల్పించారు. ఆవిష్కర్తలు చేసిన పరిసరాలకు పేటెంట్ పొందే అవకాశం కల్పించనున్నారు.
ఆవిష్కరణ అంటే..
ఒక ఉత్పత్తి, ఒక ప్రక్రియ, ఒక కార్యక్రమం లేక మనలో కలిగే సృజనాత్మకత ఆలోచనే ఆవిష్కరణ. ఇలా ఆవిష్కరణ ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడంతోపాటు సమగ్ర అవగాహన కలిగి ఉండడం ఆవిష్కరణకు దారితీస్తుంది. మన చుట్టూ ఉండే సమస్యలకు సంబంధించి వినూత్నంగా ఆలోచించి పరిష్కారం అవలంబించే పద్ధతి సైతం ఆవిష్కరణ అనిపించుకుంటుంది. సమస్య పరిష్కారానికి ఏదైనా వస్తువును విభిన్నంగా తయారు చేయగలిగిన వారే ఆవిష్కర్తలుగా గుర్తించబడుతారు. వారిలోని ప్రతిభను తెలియజేసేందుకు ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
వాట్సాప్ ద్యారా..
వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణలు రూపొందించే ముందు ఇందుకు సంబంధించిన ఆరు వ్యాఖ్యాలతో కూడిన ఆవిష్కరణ వివరణ, రెండు నిమిషాల నిడివి కలిగిన వీడియో, ఆవిష్కరణ నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, వయస్సు, మొబైల్ నెంబర్, వృత్తి, పూర్తి వివరాలు, అడ్రస్ను 9100678543 నెంబర్ వాట్సాప్కు పంపించవచ్చు. ఆసక్తిగల వారు ఆగస్టు 5వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన ఆవిష్కరణలను ఎంపిక చేసి ఆగస్టు 15న ప్రదర్శించనున్నారు. పాల్గొన్న వారికి ప్రశంసాపత్రం అందజేస్తారు.
వినూత్న ఆవిష్కరణలతో రావాలి
ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతిఒక్కరూ వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు, యువకులు, ఐటీ నిపుణులు, గృహిణులు, రీసెర్చర్స్ పాల్గొనాలి. వచ్చిన ఆవిష్కరణల్లో ఉత్తమమైనవి ఎంపిక చేసి ఆగస్టు 15వ తేదీన ప్రదర్శిస్తారు. పాల్గొన్న వారికి ప్రశంసాపత్రం అందజేస్తారు.
– రవీందర్, డీఈవో, మహబూబ్నగర్
సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని వెలికితీసేందుకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు నిత్యజీవితంలో ఉపయోగపడే ఆవిష్కరణలకు ఇది మంచి అవకాశం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏవైనా సందేహాలుంటే 8897155001 నెంబర్కు సంప్రందించాలి.
– శ్రీనివాసులు, సైన్స్ అధికారి, మహబూబ్నగర్ జిల్లా