చిన్నంబావి, ఆగస్టు 17 : సీఎం కేసీఆర్ పాలన దేశానికే తలమానికమని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలో స్థానిక ఎం పీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసి న నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లుగా కరోనాతో ఇబ్బందులు పడుతు న్నా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా రైతుల కు, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం కలుగకుం డా రైతుబంధు, రైతుబీమా, పింఛన్లను అం దించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు.
అదేవిధంగా నూతనంగా మండలకేంద్రంలో ప్రభుత్వ భవనాలు లేక ఇ బ్బందులు ఎదుర్కొంటుండడంతో త్వరలోనే ప్రభుత్వ సమీకృత భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. మండలంలోని దగడపల్లి గ్రామం నుంచి తూంకుంట వరకు రూ. 2.40కోట్లతో బీటీ రోడ్డుకు నిధులు మంజూరయ్యాని అదేవిధంగా కాశిరెడ్డి వా గు బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరలో నిర్మిస్తామన్నారు. మండలకేంద్రంలో హెల్త్ ప్రైమరీ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. చిన్నంబావి మండల ప్రజల చిరకాల కోరిక సింగోటం-గోపల్దిన్నె లింక్కెనాల్ నిర్మాణం ప నులు ప్రారంభమయ్యాయని తెలిపారు.
మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఆరుగురు లబ్ద్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను, 11మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మె ల్యే బీరం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకట్రమణమ్మ, ఎంపీడీవో రవినారాయణ, తాసిల్దార్ ఘాన్షీరాంనాయక్, టీఆరఎస్ మం డల అధ్యక్షుడు ఈదన్నయాదవ్, సింగిల్విండో చైర్మన్ బగ్గారి నరసింహారెడ్డి, గొవిం దు శ్రీధర్రెడ్డి, రామస్వామి, చక్రధర్గౌడ్, నర్సింహ, నంది కౌసల్య, ఆనంద్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వీపనగండ్ల, ఆగస్టు 17 : కొల్లాపూర్ నియోజకవర్గంలోనే రాజకీయ చైతన్యం గల వీపనగండ్ల మండలాభివృద్ధికి నిరంతర కృషి చేస్తానని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ని రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో లబ్ధిదారులకు నూత న పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. మొదటి విడుతలో భాగంగా మండలంలో ని బొల్లారం గ్రామానికి చెందిన 48 మంది లబ్ధిదారులకు మంజూరైన నూతన పెన్షన్ కార్డులను అందజేశారు.
మండలంలోని 37 మంది లబ్ధిదారులకు కల్యాణల క్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశా రు. అదేవిధంగా అనారోగ్యం బారినపడి దవాఖానలో చికిత్స పొందిన 15 మంది లభ్ధిదారులకు రూ.6.12 లక్షల విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రం లో ఎన్నో ఏండ్ల నుంచి పెండింగులో ఉన్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులను ప్రత్యేక చొరవతో చేయించడం జరుగుతుందన్నా రు.
మండల కేంద్రంలో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. కొత్తకోటలో నిర్వహిస్తున్న మండలానికి చెందిన గురుకుల పాఠశాలను మంత్రి నిరంజన్రెడ్డి సహకారంతో వీపనగండ్లలోనే ఏర్పాటు చేయుటకు చర్య లు తీసుకుంటున్నామని, అలాగే వివిధ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా పంపించినట్లు ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వర్రావు, రైతుబంధు సమితి మండలాధ్యక్షు డు ఎత్తం కృష్ణయ్య, తాసిల్దార్ పాండునాయక్, ఎంపీడీవో కతలప్ప సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.