‘అన్ని దానాలకంటే రక్తదానం మిన్న’.. ‘రక్తదానం మహాదానం’. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాలు విజయవంతమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన క్యాంపులకు అనూహ్య స్పందన లభించింది. ఎమ్మెల్యేలు, అధికారులు శిబిరాలను ప్రారంభించగా.. యువత, అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానమన్నారు. మూడు నెలలకోసారి దానం చేయొచ్చని, రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకొని ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
దేవరకద్ర రూరల్, ఆగస్టు 17 : రక్తదానం చేయడం అలవాటు చేసుకుందామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. 75 మంది రక్తదానం చేశారన్నారు. రక్తదానం చేసిన వారిని అభినందించి ఇన్సూరెన్స్ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు, సర్పంచులు, పోలీసులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అచ్చంపేట, ఆగస్టు 17 : రక్తదానం చేసి మరొకరికి ఊపిరినిద్దామని విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. ఏరియా దవాఖానలో బుధవారం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని విప్ ప్రారంభించారు. దవాఖాన ప్రాంగణంలో మొక్కలు నాటారు. నూతన దవాఖాన చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ అన్నదానం చేస్తే ఒక పూట ఆకలి తీరుతుందని, రక్తదానం చేస్తే ప్రాణాలు నిలపొచ్చన్నారు.
రక్తదానం చేయడం అలవాటుగా చేసుకోవాలన్నారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, జెడ్పీటీసీ మంత్రియానాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్ తులసీరాం, దవాఖాన సూపరింటెండెంట్ ప్రభు, డిప్యూటీ డీఎంహెచ్వో సురేశ్, ఉప మలేరియా అధికారి అశోక్ప్రసాద్, కౌన్సిలర్లు శివ, మన్నుపటేల్, సోమ్లానాయక్, శ్రీను, నాయకులు పర్వతాలు, రాజేశ్వర్రెడ్డి, గోపాల్నాయక్, అమినోద్దీన్, బాలరాజు, వెంకటేశ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల టౌన్, ఆగస్టు 17 : ఆరోగ్యవంతులంద రూ రక్తదానం చేసి.. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారి పాలిట ప్రాణదాతలు కావాలని ఎమ్మెల్యే ల క్ష్మారెడ్డి తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జడ్చర్ల ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 75 మంది రక్తదానం చేశారన్నారు.
అనంతరం రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాద య్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ సీఈ వో జ్యోతి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, అదనపు డీ ఎంహెచ్వో శ్రీధర్, డీఎంఎచ్వో కార్యాలయ అధికారి నర్సింహారెడ్డి, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎం పీడీవో ఉమాదేవి, ఎంఈవో మంజులాదేవి, మున్సిపల్ కమిషనర్ మహమూద్షేక్, డాక్టర్లు శివకాంత్, మనుప్రియ, సమత తదితరులు పాల్గొన్నారు.
కొల్లాపూర్, ఆగస్టు 17 : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ఆయుష్షు పెంచుదామని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. స్వ తంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శిబిరంలో 38 మంది రక్తదానం చేశారన్నారు. ముందుగా మున్సిపల్ కమిషనర్ రాజయ్య, ఉపాధ్యాయుడు శ్రీకాం త్ రక్తదానం చేయగా.. ఆ తరువాత పోటీపడి ఉద్యోగులు రక్తదానం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే రక్తదాతలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమం లో అదనపు డీఎంహెచ్వో వెంకట్దాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్నాయక్, తాసిల్దార్ రమేశ్, ఎ స్సైలు రమణయాదవ్, మురళి, సివిల్ దవాఖాన అభివృద్ధి కమిటీ చైర్మన్ జంబులయ్య, సీహెచ్సీ సూపరింటెండెంట్ యాదగిరి, డా.భరత్రావు, పెం ట్లవెల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్, వై ద్యులు శ్రీనివాస్, జయచంద్రప్రసాద్ యాదవ్, రామ్మోహన్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
వడ్డేపల్లి, ఆగస్టు 17 : రక్తదానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా తరలిరావాలని ఎమ్మెల్యే అ బ్రహం పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో ప్ర భుత్వ దవాఖానలో బుధవారం ఏర్పాటు చేసిన ర క్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేసి తో టి వారి ప్రాణాలు కాపాడుదామన్నారు.
సుమారు 75 మంది రక్తదానం చేశారని చెప్పారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రజిత, జెడ్పీటీసీ రాజు, వైస్ చైర్పర్సన్ సుజాత, కౌన్సిలర్లు రవి, లలిత, నాయకులు సీతారాంరెడ్డి, శ్రీనివాసులు గౌడ్, తాసిల్దార్ జయరాములు, పోలీసులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.