మరికల్, ఆగస్టు 17 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ను పురస్కరించుకొని మండలంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బుధవారం క్రీడా పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పీ వైస్చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి హాజరై మాట్లాడుతూ క్రీడల వల్ల స్నే హబంధాలు పెరుగుతాయన్నారు. విద్యార్థులకు ఖోఖో, వా లీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవికుమా ర్, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు రాజే శ్, ఎంపీడీవో యశోదమ్మ, ఎంపీవో బాలాజీ, కార్యదర్శి శ్రీనివాస్రావు, యువకులు, నాయకులు పాల్గొన్నారు.
మక్తల్, ఆగస్టు 17 : గ్రామీణ క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ఎంపీడీవో శ్రీధర్ అ న్నారు. మండలంలోని ముష్టిపల్లిలో స్వతంత్ర భారత వ జ్రోత్సవాల్లో భాగంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ మండలస్థాయి పోటీలను సర్పంచ్ విజయలక్ష్మి ఆధ్వర్యం లో బుధవారం ఎంపీడీవో ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పోటీల్లో క్రీడా నైపుణ్యతను ప్రదర్శించిన క్రీడాకారులను ఈనెల 18న జిల్లాస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీవో పావని, ఉమ్మడి జిల్లా షూటింగ్ బాల్ అధ్యక్షుడు గోపాలం, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు ప్రతాప్రెడ్డి, ఉపసర్పంచ్ వెంకటన్న, పీఈటీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట, ఆగస్టు 17 : క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు పేరు తీసుకురావాలని సీఐ శ్రీకాంత్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ ప్రధానకా ర్యదర్శి చెన్నారెడ్డి అన్నారు. ఈనెల 24, 25వ తేదీల్లో మె దక్ జిల్లాలో రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు జరుగనున్నాయి. పోటీల్లో పాల్గొనేందుకు బు ధవారం పట్టణంలోని క్రీడా మైదానంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అండర్ 14, 18, 20 జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ వి ద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమన్నా రు. క్రీడా పోటీల ఎంపికలకు 350 మంది క్రీడాకారులు హాజరు కావడం అభినందనీయమన్నారు. అనంతరం జెం డా ఊపి ఎంపికలను ప్రారంభించారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి రమణ, కార్యనిర్వాహణ అధికారి జగదీశ్, పీఈటీలు రూప, ఇబ్రహీం, విద్యాసాగర్, బాలరాజు, రాకేశ్, యాదమ్మ, పర్వీన్, రాజేశ్వరి, దామోదర్, రాధిక, క్రీడాకారులు పాల్గొన్నారు.
మద్దూర్, ఆగస్టు 17 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ మండలస్థాయి పోటీల ను బుధవారం మండలంలోని యువతీయువకులకు క్రీడా పోటీలు నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాలలో నిర్వహించిన క్రీడా పోటీలను ఎంపీడీవో వి జయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.
క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమాని, క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఈనెల 19న జిల్లాస్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొంటారన్నారు. పోటీల్లో విజేతలుగా కబడ్డీలో మొదటిస్థానం చెన్నారెడ్డిపల్లి, రెండో స్థానం అచ్చంపల్లి, ఖోఖోలో మొదటి స్థా నం పెదిరిపాడ్, రెండో స్థానం చెన్నారెడ్డిపల్లి, వాలీబాల్ మొ దటి స్థానం మద్దూర్ సీనియర్స్, రెండో స్థానం మద్దూర్ జూనియర్స్ గెలుపొందారు.