దేవరకద్ర రూరల్, ఆగస్టు 17 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాలకు చెందిన 214మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు రూ.2,14,24,824 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్షా116 అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పేదింటి ఆడబిడ్డ పెండ్లి చేసేందుకు తల్లిదండ్రులు పడిన కష్టాన్ని స్వయంగా చూసిన కేసీఆర్.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేనివిధంగా కల్యాణలక్ష్మి పథకాన్ని రూపొందించి ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్షా116 అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే అన్ని సామాజికవర్గాలు, కులవృత్తిదారుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
కేసీఆర్ ము ఖ్యమంత్రి సీటులో ఉన్నందుకే ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పా రు. ముఖ్యంగా రైతాంగాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రైతుబంధు పథకంతో ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు పంటలకు పెట్టుబడిసాయం అందిస్తున్నట్లు తెలిపారు. రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే రైతుబీమాతో కేవలం 10రోజుల్లో రూ.5లక్ష ల బీమా డబ్బులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్, సకాలంలో రాయితీపై విత్తనాలు, ఎరువుల సరఫరా, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు వివరించా రు. అందరి అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడు రుణపడి ఉండాలన్నారు. అనంతరం దేవరకద్ర మండల ప్ర త్యేకాధికారి శంకరాచారి, ఎంపీవో శ్రీనివాసరావు ఉత్తమ ఉద్యోగ అవార్డు తీసుకున్న సందర్భంగా వారిని శాలువాతో సన్మానిం చారు.
కార్యక్రమంలో ఎంపీపీలు రమాదే వి, హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీలు అన్నపూర్ణ, రాజేశ్వరి, తాసిల్దార్లు జ్యోతి, సువర్ణరాజు, ఎంపీడీవో శ్రీనివాసులు, ముడా డైరెక్టర్ కర్ణంరాజు, రైతుబంధు సమితి మండల అ ధ్యక్షుడు కొండారెడ్డి, టీఆర్ఎస్ మండల అ ధ్యక్షులు జెట్టి నర్సింహారెడ్డి, కోటరాము, నా యకులు శ్రీకాంత్యాదవ్, కొండా శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్, వెంకటేశ్, బాలస్వామి, రామకృష్ణ, విజయ్ పాల్గొన్నారు.