నాగర్కర్నూల్, ఆగస్టు 11: జిల్లా కేంద్రంలో నిర్వహించే 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై అదనపు కలెక్టర్లు మనూచౌదరి, మోతీలాల్లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసే శకటాలు, ఎగ్జిబిషన్ స్టాల్స్ ఆకర్షణీయంగా ఉండాలన్నారు.
శకటాలకు సంబంధించి వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, ఎస్సీ కార్పొరేషన్, పంచాయతీరాజ్, అటవీ, వైద్య ఆరోగ్య శాఖల ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. శకటాలు, ఎగ్జిబిషన్ స్టాళ్లకు సంబంధించి ఆర్డీవో ఓవరాల్ ఇన్చార్జిగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రూప్ డ్యాన్స్ చేసే విద్యార్థుల కార్యక్రమం డ్రెస్ కోడ్ ధరించి, దేశభక్తి గేయాలపై మాత్రమే ప్రదర్శించాలన్నారు. పరేడ్ మైదానంలో షామియానా వంటి ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ చూడాలన్నారు.
స్టేజ్, సీటింగ్ ఆరేంజ్మెంట్కు సంబంధించి ఆర్డీవో పర్యవేక్షణ చేయాలని, పిల్లలకు తాగునీటి సమస్య లేకుండా మంచి క్వాలిటీ వాటర్ బాటిళ్లు సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారికి సూచించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులకు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ముఖ్యమైన వారందరికీ తప్పకుండా ఆహ్వాన పత్రికలు పంపించాలన్నారు. ఆగస్టు 15 సందర్భంగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పోలీస్ మైదానంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కోరారు.
నాగర్కర్నూల్, ఆగస్టు 11: నాగర్కర్నూల్లో సరస్వతీ శిశుమందిర్ పాఠశాలకు చెందిన చిన్నారులు గురువారం కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి రాఖీ వేడుకలు జరుపుకొన్నారు. ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్నలక్ష్మి కలెక్టర్కి రాఖీ కట్టగా చిన్నారులు కలెక్టర్, అదనపు కలెక్టర్ మనూచౌదరికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లలిత, సీమ, మంజుల, సత్యవాణి, చంద్రకళ, స్వాతి, సుజాత, బిందు పాల్గొన్నారు.
నాగర్కర్నూల్, ఆగస్టు 11: రాఖీ పండుగను పురస్కరించుకొని కలెక్టర్ ఉదయ్కుమార్ జిల్లాలోని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్లో బ్రహ్మకుమారీలు కలెక్టర్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. నాగర్కర్నూల్ ఇన్చార్జి బ్రహ్మకుమారి సుజన, ప్రభ, విజయ కలెక్టర్కు రాఖీ కట్టారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారి రాఘవయ్య, వీణ తదితరులుపాల్గొన్నారు.
నాగర్కర్నూల్, ఆగస్టు 11: సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి చైతన్య పరచడమే లక్ష్యంగా సైబర్ టీమ్ పనిచేస్తుందని కలెక్టర్ ఉదయ్కుమార్, ఎస్పీ మనోహర్ అన్నారు. నేరాలను విద్యార్థులు పసిగట్టాలని సూచించారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఓఫంక్షన్హాల్లో ‘సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే’ కార్యక్రమాన్ని జిల్లా షీటీమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈసందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆన్లైన్ ఉమెన్ సెఫ్టీ తెలంగాణ, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై జిల్లాలో 50 పాఠశాలల నుంచి 50 మంది ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 100మంది విద్యార్థులకు 10నెలల సైబర్ నేరాలపై తీసుకొనే జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. . అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సెల్ఫోన్లు, అంతర్జాలం, ఆన్లైన్ వేదికల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందన్నారు.
ఈ నేపథ్యంలో పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహనకల్పించే కార్యక్రమానికి పోలీస్శాఖ, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ సైబర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతకుముందు సైబర్ నేర నివారణకు సంబంధించిన ప్యాకెట్ పుస్తకాలను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సీహెచ్ రామేశ్వర్, కేజీబీవీల జిల్లా నోడల్ అధికారి చైతన్య, షీటీమ్ ఇన్చార్జి విజయలక్ష్మి, వెంకటయ్య, జిల్లాలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నాగర్కర్నూల్, ఆగస్టు 11: రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈనెల 12న పాఠశాలలకు ఐచ్ఛిక సెలవుకు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని జిల్లా పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రతి కుటుంబంలో రాఖీ పౌర్ణమి ఘనంగా నిర్వహించుకుంటున్న సందర్భంగా ప్రతి ఏడాది జిల్లాలోని అన్ని పాఠశాలలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఐచ్ఛిక సెలవు ఇస్తున్నారన్నారు.
అయితే ఈ ఏడాది వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 12న నిర్వహించే పాఠశాలస్థాయి ఆటల పోటీలను చాలా పాఠశాలల్లో ప్రారంభించారని, మిగతా పాఠశాలల్లో తర్వాత నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు అన్ని సిద్ధం చేసుకున్నారన్నారు. అందుకని విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులను దృష్టి లో ఉంచుకొని ఐచ్ఛిక సెలవు ఇచ్చేందుకు అనుమతించాలని కోరారు. కలెక్టర్ అందుకు సానుకూలంగా స్పందిస్తూ డీఈవోకు ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సూర్య శ్రీనివాస్గౌడ్, ప్రధాన కార్యదర్శి తుమ్మల సురేందర్రెడ్డి, పత్రికా సంపాదకులు దొడ్ల సత్యనారాయణరెడ్డి, సభ్యులు బాబురావు, సుదర్శన్ పాల్గొన్నారు.