నాగర్కర్నూల్, ఆగస్టు 11: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో జిల్లా ప్రజల భాగస్వామ్యం, స్ఫూర్తి అమోఘమని కలెక్టర్ ఉదయ్కుమార్ అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు రెండువారాలపాటు నిర్వహిస్తున్న వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లాలో ఫ్రీడమ్ రన్ ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటలకు కలెక్టరేట్ నుంచి ప్రారంభమై ట్యాంక్బండ్ మైసమ్మ గుడి నుంచి తిరిగి కలెక్టరేట్కు చేరుకున్నారు.
ఈ ఫ్రీడమ్న్ల్రో కలెక్టర్తోపాటు జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఎస్పీ మనోహర్, జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది, పెద్దసంఖ్యలో యువత, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ కుల, మత, ప్రాంత, వర్గ బేధాలు లేకుండా మనమంతా భారతీయులమని ప్రపంచానికి చాటిచెప్పాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఫ్రీడమ్ రన్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, అదనపు ఎస్పీలు రామేశ్వర్రావు, భరత్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బిజినేపల్లి, ఆగస్టు 11: వజ్రోత్సవాల్లో భాగంగా ప్రజలు మమేకమై బిజినేపల్లి అంబేద్కర్ చౌరస్తా నుంచి వెల్గొండ గేటు వరకు 2కే రన్ నిర్వహించారు. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొందాం, స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుదాం అంటూ ప్రధానోపాధ్యాయులు రాములునాయక్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వెల్గొండ సర్పంచ్ కూర కురువమ్మ, ఉప సర్పంచ్ నాగేశ్ , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వజ్రోత్సవాల్లో భాగంగా వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో దేశ విభజన భయానక సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యాలయ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ప్రిన్సిపాల్ భాస్కర్కుమార్ ప్రారంభించారు. అనంతరం ఇంటింటా జాతీయ జెండా నినాదంతో విద్యార్థులు ఫ్లకార్డులు, జెండాలతో ర్యాలీ నిర్వహించారు.
తిమ్మాజిపేట,ఆగస్టు 11 : స్వతంత్ర ఫలాలు అందరికీ అందేలా కృషిచేయాలని, దీనికోసం మనమంత పునరంకితులవుదామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. యువకులు, విద్యార్థులతో కలిసి రన్ను ప్రారంభించి, అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమంలో పాల్గొని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీంద్రనాథ్రెడ్డి, జెడ్పీటీసీ దయాకర్రెడ్డి, సర్పంచ్ వేణుగోపాల్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, తాసిల్దార్ సరస్వతి పాల్గొన్నారు.
తిమ్మాజిపేట,ఆగస్టు 11 : మండలంలోని మారేపల్లి గ్రామంలో వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అనంతరం ఫ్రీడమ్ రన్ నిర్వహించినట్లు జీహెచ్ఎం సత్యనారాయణశెట్టి తెలిపారు.
కల్వకుర్తి రూరల్, ఆగస్టు11: ప్రతి ఒక్కరికీ జాతీయ భావాలు స్పురించేలా స్వాత్రంత్య సాధనకోసం జాతీయ నాయకులు చేసిన ఉద్యమాలు ప్రతిబింబించేలా ఫ్రీడమ్ రన్ కార్యక్రమం ఉపకరిస్తుందని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. మండలంలోని స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం ఫ్రీడమ్ రన్ ప్రారంభించారు. ఫ్రీడమ్ రన్లో ప్రతిభకనబరిచిన యువకులకు బహుమతులను అందజేశారు. అదేవిధంగా ఎస్బీఎంఎస్ బీఈడీ కళాశాల విద్యార్థులు ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించి పాలమూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు సునీతావెంకట్రెడ్డి, పాండుగౌడ్, పద్మ అంజియాదవ్, ఎంపీటీసీ సంతోషమల్లేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ బాల య్య, నాయకులు, చెన్నకేశవ్, అంజియాదవ్, ఉప సర్పంచులు, ఇన్చార్జి ఎంపీడీవో ఆంజనేయులు, ఎంపీవో దేవేందర్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
చారకొండ, ఆగస్టు 11 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలో దేశ సమైక్యతను చాటాలని సింగిల్ విండో చైర్మన్ గురువయ్యగౌడ్ అన్నారు. గురువారం వజ్రోత్సవాలో భాగంగా తాసిల్దార్ నాగమణి, ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
చారకొండ నుంచి బోడబండతండా వరకు 2కెరన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గ్యార లక్ష్మణ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, మం డల కోఆప్షన్ సభ్యుడు షేక్ సలీం, సింగిల్ విండో డైరెక్టర్ రమేశ్, నాయకులు తన్నీరు రామకృష్ణ, ఆనంద్, పాండు, శ్రీనుగౌడ్, జగదీశ్, రవినాయక్, పీఈటీ అంజయ్య, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ పరంజ్యోతి పాల్గొన్నారు.
కల్వకుర్తి, ఆగస్టు 11: మున్సిపాలిటీలో ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయాలని మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న వేడుకల్లో గురువారం మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
బ్రిలియంట్ పాఠశాల విద్యార్థులు, ఎస్బీఎంఎస్ ఛాత్రోపాధ్యాయులు జాతీయ జెండాలను చేతబట్టి 75 సంఖ్య ఆకృతిలో కూర్చుని సంబురాలు జరుపుకొన్నారు. అదే విధంగా కల్వకుర్తి ప్రభుత్వ పాఠశాల నుంచి రఘుపతిపేట రోడ్డులోని పెట్రోల్ బంక్ వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు.
వంగూరు, ఆగస్టు 11: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని మండలకేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం నుంచి హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమమ్మలాలూయాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు గణేశ్రావు, జెడ్పీ కోఆప్షన్ హామీద్, మార్కెట్ డైరెక్టర్ రాజేందర్రెడ్డి, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్, తాసిల్దార్ రాజునాయక్, ఎస్సై కురుమూర్తి, ఎంపీడీవో పవన్కుమార్, ఎంఈవో శంకర్నాయక్తోపాటు వివిధ పార్టీల నేతలు ప్రవీణ్రెడ్డి, రమేశ్గౌడ్, రాజరంగారావు, యువకులు పాల్గొన్నారు.
వెల్దండ, ఆగస్టు 11 : మండలకేంద్రంలో గురువారం వెల్దండ పోలీస్ సర్కిల్ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్స్టేషన్ నుంచి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వరకు ఫ్రీడమ్ రన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ విజితారెడ్డి, సీఐ రామకృష్ణ, సర్పంచ్ భూపతిరెడి, ప్రజా ప్రతినిధులు, నాయకులు జాతీయ జెండా లు చేతబూని ఫ్రీడమ్ రన్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎస్సై నరసింహులు, ఎంపీడీవో మోహన్లాల్, టీఆర్ఎస్ యూ త్ మండల అధ్యక్షుడు జంగిలి యాదగిరి, ఏపీవో ఈశ్వర్జీ, కార్యదర్శి గిరిగౌడ్, మాజీ ఎంపీటీసీ భీమయ్యగౌడ్ ఉన్నారు.
తాడూరు, ఆగస్టు 11 : మండలకేంద్రంలో గురువారం ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని జెడ్పిసీఈవో ఉషాతోపాటు ఎంపీడీవో గంగమోహన్ ప్రారంభించారు. జెడ్పీహెచ్ఎస్ నుంచి మల్కాపూర్ గేటు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 13, 14వ తేదీల్లో మండలస్థాయిలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్జంప్ తదితర క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విజేతలకు జిల్లా స్థాయిలో పోటీలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ శ్రీనివాసులు, తాసిల్దార్ కా ర్తీక్, ఎస్సై శ్రీనివాసులు, ఎన్పీవో లక్ష్మానాయక్, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే మం డలంలోని అల్లాపూర్ యూపీఎస్ పాఠశాలలో ఆజాదీకా అమృ త్ మహోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలను, వ్యాసరచన నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు కట్టా శ్రీనివాస్రెడ్డి తెలిపారు.