మహబూబ్నగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధునాతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం మహబూబ్నగర్ అర్బన్ మండలంలోని బండమీదిపల్లి వద్ద ఉన్న పశుసంవర్ధక శాఖ, పాడి పారిశ్రమాభివృద్ధి సంస్థకు చెందిన 15 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి శ్రీనివాస్గౌడ్ వినతిపత్రం సమర్పించారు.
ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం అనంతరం సీఎంను కలిసిన ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. అధునాతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు చేయాలని కోరారు. ఆయన వెంట దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఉన్నారు.