వనపర్తి, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : వనపర్తి మెడికల్ కళాశాల తరగతుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గురువారం నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు ఇచ్చింది. కళాశాలకు కా వాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని గుర్తించి ప్రస్తుత విద్యా సంవత్సరం నుం చి తరగతులు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది.150 సీట్లతో 2022-23 విద్యా సంవత్సరానికి కళాశాలను ప్రారంభించుకోవచ్చని తెలిపింది.
నిబంధనల మేరకు కాలేజీకి అవసరమైన మౌలిక సౌకర్యాలు, లాబొరేటరీ, లైబ్రరీ, హాస్టల్స్, సౌకర్యాలు, ఫ్యా కల్టీ, అనుభవం, పబ్లికేషన్స్, నర్సింగ్ అండ్ పారా మెడికల్ సిబ్బంది వంటి సౌ కర్యాలను ది మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు(ఎంఏఆర్బీ) పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బోర్డు నివేదిక ఆధారంగా నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు ఇచ్చింది.
గత ఎన్నికల సందర్భంగా వనపర్తి జిల్లాకు మెడికల్ కళాశాల ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మంజూరు చేయడంతోపాటు, రూ.510 కోట్ల నిధులు కేటాయించారు. కళాశాల కోసం 50 ఎకరాల సువిశాల స్థలాన్ని జిల్లా కేంద్రంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కేటాయించారు.
ముఖ్యమంత్రి కేటాయించిన నిధులతో మెడికల్ కళాశాల భవనం, పరిపాలనా భవనం, వి ద్యార్థి, సిబ్బంది, వసతి గృహాల నిర్మా ణం చేపట్టనున్నారు. మెడికల్ కళాశాలకు జాతీయ ఆరోగ్య కమిషన్ అనుమతి నేపథ్యంలో సీఎం కేసీఆర్కు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు వనపర్తి జిల్లా ప్రజల పక్షాన మంత్రి నిరంజన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.