మంత్రాలయం, ఆగస్టు 11 : మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి శ్రీమఠం లో 351 సప్తరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ప్రహ్లాద రాయలకు పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు విశేష పూ జలు జరిపారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన బం గారు పల్లకీలో ప్రహ్లాద రాయలు విహరించి భక్తులను అనుగ్రహించారు.
ఊం జల్ సేవ మండపంలో వివిధ రకాల కూరగాయలను ఉంచి శాకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు గ్రామ దేవత మంచాలమ్మకు పూజలు నిర్వహించి, స్వామి బృందావనానికి మహా మంగళహారతులు సమర్పించారు. పీఠాధిపతి భక్తులకు ఫల మంత్రాలు, అక్షింతలు అందజేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో శ్రీమఠం అధికారులు, పండితులు, భక్తులు పాల్గొన్నారు. మఠా న్ని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, ఎంపీలు, ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు.