మహబూబ్నగర్, ఆగస్టు 11 : మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి జూమ్ యాప్ ద్వారా రంక్షా బంధన్ను పురస్కరించుకుని మహిళలు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడారు.
మహిళల సాధికారతకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా రూ. 1,0116ను కానుకగా ఇస్తున్నట్లు గుర్తుచేశారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి పారిశ్రామిక విధానంలో ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిపారు. మహిళామూర్తులకు ఆకాశమే హద్దుగా అవకాశాలను కల్పించనున్నట్లు తెలియజేశారు. రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం చిత్రపటానికి రాఖీలు కట్టి ఆశీర్వదించాలని కోరారు.
అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళలు అందరూ సీఎం కేసీఆర్ చిత్రపటానికీ రాఖీ కట్టాలని పిలుపునిచ్చారు. వీసీకి జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరవీందర్, శివరాజ్, కార్యదర్శి వినోద్కుమార్ ఉన్నారు