ఊట్కూర్/ నర్వ/ కోస్గి/ నారాయణపేట రూరల్/ నారాయణపేట టౌన్/ మక్తల్ టౌన్/ జడ్చర్ల టౌన్. ఆగస్టు 5 : శ్రావణ మాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతం ఆచరించారు. ప్రసిద్ధ ఆలయాలు, నివాసగృహాల్లో లక్ష్మీపూజలు నిర్వహించారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని ఊట్కూర్ మండలంలోని స్థానిక సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో దంపతులు సామూహిక వ్ర తంలో పాల్గొన్నారు. అలాగే ఆర్యసమాజ్ మందిరంలో శ్రా వణ త్రిదివసీయ వేడుకలో దంపతులు పాల్గొని శ్రావణ వే ద యజ్ఞం నిర్వహించారు.
నర్వ మండలంలోని అన్ని గ్రా మాల ఆలయాల్లో మహిళలు వరలక్ష్మీవ్రతం, ప్రత్యేక పూజ లు, చేసి లక్ష్మీదేవిని పంటలు సకాలంలో పండి, ప్రజలందరూ ఆర్థికంగా, ఆయూరారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని దీవించాలని కోరుకున్నారు. కోస్గి మండలంలో ని మహిళలు వరలక్ష్మీవ్రతం నివాసగృహాల్లో నిర్వహించి ముత్తయిదువులకు పసుపుబొట్టు ఇచ్చారు. నారాయణపేట మండలంలోని లోకపల్లి లక్ష్మమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మహిళలు సామూహికంగా కుంకుమార్చన చేశారు. శ్రీహంసవాహిని ఉన్నత పాఠశాలలో వరలక్ష్మీవ్రతం నిర్వహించారు.
విద్యార్థులకు వరలక్ష్మీవ్రతంపై వివరించారు. అనంతరం ఆకులు, పండ్లు, వక్కలతో వాయినాలు సమర్పించారు. నా రాయణపేట టౌన్లో వరలక్ష్మీ వ్ర తాన్ని ఆచరించడం వల్ల విశేష ఫ లితాలు పొందవచ్చని ఆర్ఎస్ఎస్ జిల్లా సహ కార్యవహ మ్యాడం ప్ర భాకర్ అన్నారు. పట్టణంలోని సిం గార్భేస్లో సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో వరలక్ష్మీ వ్ర తం నిర్వహించారు. మహిళలు అ మ్మవారికి పసుపు, కుంకుమ, చందనం, గాజులు, పువ్వు లు సమర్పించి పూజా కార్యక్రమాలు చేశారు.
మక్తల్ మం డలంలో నివాసగృహాలు, సరస్వతీ శిశు మందిర్లో మహిళలు సామూహికంగా వరలక్ష్మీవ్రతం నిర్వహించి వ్రతం వి శిష్టతను విద్యార్థులకు వివరించారు. శిశు మందిర్లో సూ గూర్ సురేందర్ విద్యార్థులకు 40 కుర్చీలు ఇచ్చారు. జడ్చర్లలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతం, ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం, పూజలు చేశారు.