శ్రీశైలం, ఆగస్టు 5: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరదనీరు చేరుకుంటుంది. శుక్రవారం ఉదయం డ్యాం ఐదు గేట్లను 10అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 1,08,918, విద్యుదుత్పత్తి ద్వారా 36,735, సుంకేసుల నుంచి 79,268 క్యూసెక్కులు మొత్తం 2,24,921క్యూసెక్కుల వరదనీరు విడుదల కాగా సాయంత్రం వరకు రిజర్వాయర్కు 2,35,874 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది.
అదే విధంగా 5 గేట్లను 10అడుగుల ఎత్తులో తెరిచి 1,39,915 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 31,299, ఎడమగట్టు విద్యుదుత్పత్తి ద్వారా 31,784క్యూసెక్కులు మొత్తం 2,02,998 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు, నీటి నిల్వలు 215టీఎంసీలు కాగా ప్రస్తుతం 884.80అడుగులు 214.3637టీఏంసీలుగా ఉన్నాయి. ఏపీ పవర్హౌస్లో 17.133మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయగా టీఎస్ పవర్హౌస్లో 17.15 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
అయిజ, ఆగస్టు 5 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో టీబీ డ్యాంకు వరద చేరుతున్నది. దీంతో అధికారులు 10గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఇన్ఫ్లో 34,524, అవుట్ఫ్లో 34,524క్యూసెక్కులు ఉంది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల డ్యాంలో ప్రస్తుతం 101.148టీఎంసీలు నిల్వ ఉన్నది. 1633అడుగుల గరిష్ట నీటిమట్టానికి గానూ, ప్రస్తుతం 1631.84అడుగుల నీటిమట్టం ఉన్నట్లు టీబీ డ్యాం ఎస్ఈ శ్రీకాంత్రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది.
తుంగభద్ర డ్యాం నుంచి కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నిలకడగా చేరుతున్నది. ఆనకట్టకు ఇన్ఫ్లో 63,579, అవుట్ఫ్లో 63,100క్యూసెక్కులు నమోదైంది. ఎగువ నుంచి వచ్చే వరదనీరు ఆనకట్ట పైనుంచి సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 479క్యూసెక్కులు చేరుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 11.6అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
రాజోళి, ఆగస్టు 5: సుంకేసులకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. శుక్రవారం ఎగువన కర్ణాటక పరిధిలోని ప్రాజెక్టుల నుంచి 80,679క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, 19 గేట్లు తెరిచి 78,584 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినట్లు జేఈ రాజు పేర్కొన్నారు. 2,095క్యూసెక్కులను కేసీ కెనాల్కు విడుదల చేసినట్లు తెలిపారు.
అమరచింత, ఆగస్టు 5: జూరాల ప్రాజెక్టుకు వారం రోజులుగా స్వల్పంగా వరదనీరు వస్తుండగా శుక్రవారం వరద ప్రవాహం పెరిగింది. దీంతో ఎగువ నుంచి ప్రాజెక్టుకు 92వేలకుపైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో అధికారులు 9గేట్లను మీటరు మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పవర్హౌస్కు 39వేల కూసెక్కులు వదలగా, కుడి, ఎడమ కాల్వలకు స్వల్పంగా నమోదవుతున్నది. మొత్తం 79వేల క్యూసెక్కుల అవుట్ఫ్లో విడుదలవుతుంది. ప్రాజెక్టులో నీరు అధికంగా ఉండడంతో మత్స్యకారులు నదిలోకి చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.