మహబూబ్నగర్/రూరల్, ఆగస్టు 4 : తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని ఎంపీపీ సుధాశ్రీ అన్నారు. మహబూబ్నగర్ మండలం జమిస్తాపూర్ అంగన్వాడీ కేంద్రంలో గురువారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. తల్లిపాల ప్రాముఖ్యత ను అందరూ తెలుసుకోవాలని సూచించా రు. అలాగే జిల్లా కేంద్రంలోని బండ్లగేరి అం గన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లో ఐసీడీఎస్ సీడీపీవో శాంతిరేఖ, సూపర్వైజర్ వసీంసుల్తానా, పంచాయతీ కార్యదర్శి జీవన్రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
భూత్పూర్, ఆగస్టు 4 : తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని సీడీపీవో శైలశ్రీ అన్నారు. మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. బిడ్డ పుట్టిన తర్వాత ముర్రుపాలు తాగించడంవల్ల సంపూర్ణ ఆరో గ్యం లభిస్తుందన్నారు. అలాగే తల్లికి రొమ్ముక్యాన్సర్ ఇతర వ్యాధులు సోకవని తెలిపా రు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నూరుల్నజీబ్, సీహెచ్వో రామయ్య, సూపర్వైజర్లు యాదమ్మ, నాగేశ్వరి, అంగన్వాడీ టీచర్లు మణెమ్మ, లక్ష్మి, గౌసియాబేగం, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట, ఆగస్టు 4 : తల్లిపాలతో బిడ్డ కు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మండల వైద్యాధికారి డాక్టర్ శ్వేత అన్నారు. మండలంలోని పోల్కంపల్లి అంగన్వాడీ కేంద్రం లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలకు హాజరై చిన్నారులతో అన్నప్రాసన చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిపాలతో బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని, 6నెలలవరకు తప్పనిసరిగా తల్లిపాలే ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సీహెచ్వో జైపాల్, వైద్యసిబ్బంది ఉన్నారు.
మిడ్జిల్, ఆగస్టు 4 : తల్లిపాలతోనే బిడ్డకు పోషకాలు లభిస్తాయని ఐసీడీఎస్ సూపర్వైజర్ రమణమ్మ అన్నారు. మండలంలోని చిల్వేర్, దోనూర్, మున్ననూర్, మంగలిగడ్డతండా తదితర గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. కిశోర బాలికలు, గర్భిణులు ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంయుక్తారాణి, పంచాయతీ కార్యదర్శులు ప్రశాంత్, శైలజ, అంగన్వాడీ టీచర్లు జయలక్ష్మి, మంజుల, రంగమ్మ, ఈశ్వరమ్మ, చం ద్రకళ, లక్ష్మి, బాలీశ్వరి పాల్గొన్నారు.
రాజాపూర్, ఆగస్టు 4 : బిడ్డకు ఆరునెల ల వరకు తల్లిపాలే ఇవ్వాలని ఐసీడీఎస్ సూ పర్వైజర్ ఆండాలు అన్నారు. మండలంలోని పలుగుతండాలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలకు హాజరై మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడంవల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కవిత, పంచాయతీ కార్యదర్శి సయ్యద్అలీ, ఏఎన్ఎం వరలక్ష్మి, అంగన్వాడీ టీచర్ స్వాతి, అలివేల, రంగమ్మ, రాధ పాల్గొన్నారు.
మహ్మదాబాద్, ఆగస్టు 4 : మండలంలోని బొమ్మినికుంటతండా అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం నిర్వహించారు. అనంతరం తల్లిపాల ప్రాముఖ్యతను అంగన్వాడీ టీచర్ కవిత వివరించారు. బిడ్డ ఆరోగ్య సంరక్షణకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని సూ చించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం లక్ష్మి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
నవాబ్పేట, ఆగస్టు 4 : మండలంలోని యన్మన్గండ్ల, పోమాల సెక్టార్లలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని తల్లిపాల విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీలత, ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజరాజేశ్వరి, సర్పంచులు జయమ్మ, కృష్ణయ్య, హెల్త్ సూపర్వైజర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్, ఆగస్టు 4 : మండలంలోని పెద్దాయపల్లి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ సునీత మాట్లాడుతూ తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమన్నారు. బిడ్డ ఆరోగ్య సంరక్షణకు తల్లిపాలే ఇవ్వాలని సూచించారు. కా ర్యక్రమంలో సర్పంచ్ శంకర్, అంగన్వాడీ టీచర్ గాయత్రి పాల్గొన్నారు.