ఊట్కూర్, ఆగస్టు 4 : తల్లిపాలలో రోగ నిరోధక శక్తి అ ధికంగా ఉంటుందని ఎంపీహెచ్ఈవో విజయకుమార్ అ న్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థా నిక 2వ ఆరోగ్య ఉపకేంద్రంలో గర్భిణులు, బాలింతలకు అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ చిన్నారుల ఎదుగుదల్లో తల్లిపాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకూ అర గంట లోపు ముర్రుపాలు పట్టించాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ మణిమాల, అంగన్వాడీ టీచర్లు, ఏ ఎన్ఎం కవిత పాల్గొన్నారు.
కృష్ణ, ఆగస్టు 4 : తల్లిపాలలో శిశువుల్లో రోగ నిరోధక శ క్తి పెరుగుతుందని, చిన్నారుల ఆరోగ్య ఎదుగుదలకు దోహ దం చేస్తాయని సీడీపీవో సరోజిని అన్నారు, తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం మండలంలోని గుడెబల్లూర్లో అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీడీపీవో సరోజిని, సూపర్వైజర్ అమ్మక్క హాజరై మాట్లాడుతూ తల్లిపాలలో పుష్కలమైన పోషకాలు ఉంటాయని అన్నారు. పిల్లలకు తల్లిపాలే తా గించాలని, డబ్బపాలతో పిల్లలు అనారోగ్యం పాలవుతారన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఏన్ఎం లు, ఆశ కార్యకర్తలు, గర్భిణులు, బా లింతలు తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్, ఆగస్టు 4 : తల్లిపాలు పిల్లలకు అమృతంలాగా పనిచేస్తాయని సర్పంచ్ అంజమ్మ అన్నారు. మండలంలోని మందిపల్లి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వా రోత్సవాల సందర్భంగా గురువారం గర్భిణులు, బాలింతలకు తల్లిపాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోతపాల కంటే తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారని తెలిపారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యం, వజ్ర సమానమైన రోగనిరోధక శక్తిని పొందాలం టే తల్లిపాలు పట్టించాలని బాలింతలకు సూచించారు. బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టించాలన్నారు. పుట్టిన బిడ్డలకు తల్లిపాలు అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు తదితరు లు పాల్గొన్నారు.