భూత్పూర్, ఆగస్టు 4: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే అన్నాసాగర్లోని తన నివాసంలో 77మందికి రూ.32,59,900 విలువ చేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకం ఎంతో ఖర్చుతో కూడుకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసంక్షేమం కోసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఈ పథకం లేదని స్పష్టం చేశారు.
గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా వెల్కిచర్ల గ్రామానికి చెందిన వికలాంగుడైన నాగయ్యకు ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి స్కూటీని అందజేశారు. వికలాంగుడైనా నిత్యం పార్టీ అభివృద్ధికి తాపత్రయ పడుతాడని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, జిల్లా మత్స్య సహకార సంఘం ఇన్చార్జి సత్యనారాయణ, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, లక్ష్మీనర్సింహాయాదవ్, కొండయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.