కోస్గి, ఆగస్టు 4: అన్ని వర్గాల అభ్యున్నతే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులు అన్ని రంగాల్లో రాణించాలని, ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో దళితబంధు పథకం తీసుకొచ్చారన్నారు.
త్వరలో మండలంలోని మరిన్ని గ్రామాల్లో పథకాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హన్మంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, ఎంపీపీ మధుకర్రావ్, జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు.