మూసాపేట, జూలై 28 : సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు చేపట్టాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణకు అధికారులు, ప్ర జాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వం చేపడుతున్న పల్లెప్రగతి కార్యక్రమంతో వ్యాధుల వ్యాప్తి చాలావరకు తగ్గిందన్నారు. ప్రజలు ముం దస్తు జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా చూడాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రతి గ్రామాన్ని అధికారులు పర్యవేక్షించి పారిశుధ్య పనులను వేగవంతం చేయాలన్నారు. అలాగే వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.
తాగునీరు కలుషితం కాకుండా పైపులైన్ల లీకేజీలకు మరమ్మతు చేయించాలని సూచించా రు. టెలీకాన్ఫరెన్స్లో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూపని కళావతీకొండయ్య, ఎంపీడీవో స్వరూప, తాసిల్దార్ మంజుల, ఎంపీవో సరోజ, డాక్టర్ శ్వేతారెడ్డితోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మండలంలోని నందిపేట సర్పంచ్ శేఖర్రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దవాఖానకు వెళ్లి అతడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ని తెలుసుకున్నారు. అతడికి మెరుగైన వై ద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, వైస్ఎంపీపీ రవీందర్రెడ్డి, జం గం మహేశ్, రాజేందర్రెడ్డి ఉన్నారు.