అమరచింత, జూలై 24: జూరాల రిజర్వాయర్కు ఎగువ నుంచి వరద వస్తున్నది. ఆదివారం సాయంత్రానికి 37,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. విద్యుదుత్పత్తి కోసం 31,323 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. డ్యాం నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.645 టీఎంసీలు నిల్వ ఉన్నది. నెట్టెంపాడు లిఫ్ట్కు 1500, భీమా లిఫ్ట్-1కు 1300, ఎడమ కాలువకు 920, కుడి కాలువకు 178, సమాంతర కాలువకు 500, భీమా లిఫ్ట్-2కు 750 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టు నుంచి మొత్తంగా 35,655 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది.
అయిజ, జూలై 24: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి 10గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 26,506 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 26,506 క్యూసెక్కులు ఉన్నది. 105.788టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన డ్యాంలో 105.788 టీఎంసీలు నిల్వ ఉన్నది. 1633అడుగుల గరిష్ఠ నీటిమట్టానికిగానూ, 1633 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు డ్యాం ఎస్ఈ శ్రీకాంత్రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఎగువన ఉన్న టీబీ డ్యాం నుంచి వరద నీరు దిగువకు విడుదల చేస్తుండడంతో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు చేరుతున్నది. ఆదివారం ఆర్డీఎస్ ఆనకట్టకు 18,843 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 18,300 క్యూసెక్కులు సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 543క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 10.4 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
రాజోళి, జూలై 24: సుంకేసుల డ్యాంకు కర్ణాటక టీబీ డ్యాం నుంచి వరద తగ్గుముఖం పట్టింది. 17,361 క్యూసెక్కులు వస్తుండగా శ్రీశైలానికి నాలుగు గేట్ల ద్వారా 16,544క్యూసెక్కులు తరలిస్తున్నట్లు జేఈ రా జు తెలిపారు. డ్యాం నీటినిల్వ 292.00మీటర్లు కాగా 291.00మీటర్లుగా నమోదైంది. 0.99టీఎంసీల సామ ర్థ్యం కాగా 0.845 టీఎంసీలు ఉన్నట్లు పేర్కొన్నారు. కేసీ కెనాల్కు 817క్యూసెక్కుల వదులుతున్నారు.
శ్రీశైలం, జూలై 24: శ్రీశైల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నిలకడగా కొనసాగుతున్నది. రెండు గేట్లు 10అడుగుల మేర ఎత్తి 50వేలకుపైగా క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ద్వారా 42,558క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 15,816క్యూసెక్కులు(మొత్తం58,374 క్యూసెక్కులు) విడుదల కాగా సాయంత్రానికి లక్షా30వేల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో నమోదైంది. రెండు గేట్ల ద్వారా 53,672 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. ఏపీ పవర్హౌస్ ద్వారా 26,724, టీఎస్ పవర్హౌస్ ద్వారా 31,784క్యూసెక్కుల నీటితో విద్యుదుత్పత్తి చేసి దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా, ప్రస్తుతం 882.30అడుగులు ఉండగా, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215టీఎంసీలుకాగా 200.64 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.