దామరగిద్ద, జూలై 23 : రైతులకు మంచి చేస్తేనే మనకు మంచి జరుగుతుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బక్క నర్సప్ప అధ్యక్షత శనివారం మం డల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅథితిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ రైతులకు మంచి చేస్తేనే మనకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కరోనా టీకాలను ప్రజలందరూ వేయించుకోవాలన్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో పాఠశాలలను అభివృద్ధి చేసుకోవాలని, వి ద్యార్థులకు వసతులు కల్పించాలన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు పలు అంశాలపై చర్చించారు. నర్సాపూ ర్ పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు విధుల్లో ఉన్నందున అదనంగా ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని మం డల విద్యాధికారిని ఎమ్మెల్యే అడగడంతో సోమవారం వర కు పంపిస్తానన్నారు. అనంతరం వివిధ గ్రామాల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కా ర్యక్రమంలో వైస్ఎంపీపీ దామోదర్రెడ్డి, ఎంపీటీసీ కిషన్రావు, సర్పంచ్ ఆశమ్మ, ఎంపీవో రామన్న, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట, జూలై 23 : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కోటకొండ గ్రామానికి చెందిన బేబి శృతికి మంజూరైన రూ. 51వేలు, చిన్నజట్రం గ్రామాని కి చెందిన చెన్నప్పకు రూ.60 వేలు, భైరంకొండ గ్రామానికి చెందిన అనిల్కు రూ. 28వేలు, పిల్లిగుండ్లతండాకు చెందిన మోహన్కు రూ.60వేలు, కొల్లంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్నాయక్కు రూ.60వేలు, అంత్వార్ గ్రామానికి చెం దిన మాస్టర్ అమృత్కు రూ.60వేల చెక్కులను అందజేశా రు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
పట్టణంలోని మినీ స్టేడియం నిర్మాణానికి అదనంగా రూ.4 కోట్ల నిధులు మంజూరయ్యాయి. శనివారం క్యాం పు కార్యాలయంలో నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మె ల్యే ఎస్.రాజేందర్రెడ్డిని వ్యాయామ ఉపాధ్యాయులు మ ర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. మినీ స్టేడియం నిర్మాణ పనులను వెంట నే ప్రారంభించి క్రీడలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యేను కో రారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు నర్సింహులు, రత్నయ్య, బాలరాజు, సాయినాథ్, రామకృష్ణారెడ్డి, రాజశేఖర్ పాల్గొన్నారు.
ధన్వాడ, జూలై 23 : మండలంలోని గున్ముక్ల కడచరా య స్వామి గుట్టకు కొత్త రిటైనింగ్వాల్కు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి రూ.20లక్షలు మంజూరు చేయించారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గ్రామస్తులకు మం జూరు పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంపై ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృ తజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుధీర్కుమా ర్, సర్పంచ్, ఉపసర్పంచ్, నాయకులు పాల్గొన్నారు.