కొల్లాపూర్, జూలై 3 : విద్యార్థులకు అన్ని సదుపాయాలతో మెరుగైన విద్యను అందించుటకు కేరాఫ్ కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సిద్ధమని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.మల్లేశం వెల్లడించారు. కాలేజీలోని వసతులు, ప్రత్యేకతలు, పరీక్షల ఫలితాలు, విశాలమైన క్రీడాప్రాంగణం, ఉన్నత వి ద్యా ప్రమాణాలు కలిగి అంకితభావం గల ఎంతో నిష్ణాతులైన అధ్యాపకులు విద్యార్థులకు నాణ్యమై న విద్యను బోధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఐ దు ఎకరాల విశాలమైన స్థలంలో 2008 లో ని యోజకవర్గ్గంలోనే తొలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఏర్పడి వేలాది మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఘనత కళాశాలకు దక్కిందన్నారు.
మెరుగైన విద్యను అందించడంలో కళాశాలకు ఐఎస్వో 2001, 2015 ప్రామాణిక సిర్టిఫికెట్ ల భించిందని ప్రిన్సిపాల్ మల్లేశం పేర్కొన్నారు. జా తీయ ప్రామాణిక సంస్థ అయిన న్యాక్ (ఎన్ఎఎసీ)చేత గత ఏడాది ‘సీ’గ్రేడ్ లభించిందని ఆయన తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న కళాశాల విద్యార్థులు రెండు రాష్ట్ర స్థాయి అవార్డులను సొంతం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే విశాలమైన తరగతి గదులతో నిర్మించిన సొంత భ వనంలో అన్ని సౌకర్యాలతో రెండు డిజిటల్ క్లాస్రూంలు, వర్చువల్ రూంలు, ల్యాబ్లు, అన్ని పుస్తకాలతో గ్రంథాలయం విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థికి మొదటి సంవత్సరం నుంచే పీజీ ప్రవేశ పరీక్ష, బీఈడ్, ఎంబీఏ వంటి ఉన్నత చదువులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఎంటర్ ప్రిన్యుయర్ షిఫ్ సెల్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తున్నామని ప్రిన్సిపాల్ మల్లేశం వివరించారు.
క ళాశాలలో ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. సమకాలిన ప్రపంచంలో జ్ఞానసముపార్జను ఉద్యోగ కల్పనకు అవసరమైన అన్ని కోర్సులను కళాశాలలో అందిస్తున్నట్లు వైస్ ప్రిన్సిపాల్ రామరాజుయాదవ్ వెల్లడించారు. బీఏ(జనరల్/కంప్యూటర్ సైన్స్), బీకాం(కంప్యూటర్ అప్లికేషన్) బీఎస్సీ (ఫిజికల్సైన్స్, కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ(లైఫ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్), అలాగే కళాశాలలో చేరిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కు 100శాతం స్కాలర్ షిఫ్తోపాటు గ్రామీణ ప్రాంతాల నుంచి కాలేజీకి వచ్చే విద్యార్థులకు బస్ సౌకర్యం ఉందని ఆయన పేర్కొన్నారు.
దోస్త్ 2022 ద్వారా అడ్మిషన్లు ప్రారంభమయ్యా యి. అడ్మిషన్ కోసం ప్రతి విద్యార్థి ఈ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి. ఆధార్కార్డు, మొబైల్ నెంబర్, ప దో తరగతి మెమో, ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధాయ ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటో ఉండాల ని పేర్కొన్నారు. వివరాలకు దోస్త్ కన్వీనర్ 9493 603075/ 8519991419/ 9542697401 నెంబర్లను సంప్రదించాలని రామరాజు యాదవ్ విద్యార్థులకు విజ్ఞాప్తి చేశారు.