వలసల గడ్డగా పేరున్న మహబూబ్నగర్ జిల్లా స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలకు కేరాఫ్గా మారిందని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో రాష్ట్ర యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆయన జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. 60కి పైగా కంపెనీలతో 5వేలపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఏడాదికి సుమారు రూ.రెండు లక్షల నుంచి రూ.పది లక్షల ప్యాకేజీ వరకు
ఉంటుందని మంత్రి పేరొన్నారు.
మహబూబ్నగర్, జూలై 3: కరువు జిల్లా…ఉపాధి లేక అన్ని ప్రాంతాలకు వలస వెళ్లే పాలమూరు ప్రాంతంలోనే ఉపాధి లభించే స్థాయికి చేరిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ ప్రాంగణంలో రాష్ట్ర యువజన సేవల శాఖ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్మేళాను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన తర్వాత 1.33 లక్షల ఉద్యో గాలు భర్తీ చేశామని, 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగు తుందన్నారు. మొత్తం 5286మంది అభ్యుర్థులు హాజరుకాగా 2215 మందికి ఉద్యోగాలు కల్పించారు.
ప్రభుత్వ ఉద్యోగం చేస్తేనే ఉద్యోగం కాద ని, ప్రైవేట్ రంగంలోనూ ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. జాజ్మేళాలో 60కంపెనీలు పాల్గొన్నాయని, 5వేలకు పైగా ఉద్యోగాలు కల్పించేందుకు జాబితాను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. మేళాకు హాజరై ఉద్యోగాలు రాని వారి వివరాలతో కూడా మారో జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి కుటుంబానికీ భరోసాను కల్పించేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
మహబూబ్నగర్ తక్కువ సమయంలో ఎవరూ ఊహించని స్థాయిలో అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. హన్వాడ వద్ద 500ఎకరాల్లో ఫుడ్ప్రాసెసింగ్ కేంద్రం, దివిటిపల్లి వద్ద 400ఎకరాల్లో ఐటీ పార్కును ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, సెట్వీన్ ఎండీ వేణుగోపాల్రావు, జిల్లా క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్, వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ కంపెనీలోనూ ఉద్యోగం రావాలంటే చాలా కష్టం. అలాంటిది ఇన్ని కంపెనీలను పాలమూరుకు పిలిపించి మాలాంటి పేద అభ్యర్థులకు ఉద్యోగాలను కల్పించేందుకు మంత్రి శ్రీనివాస్గౌడ్ చేసిన కృషిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. నాకు పలు కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారు. శ్రీవిజయ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మా కుటుంబానికి అండగా ఉండేందుకు ఈ ఉద్యోగం ఎంతో ఉపయోపడుతుంది.
– మంగమ్మ, బోయపల్లి, మహబూబ్నగర్
ఖాళీగా ఉండే బదులు వచ్చిన ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నా. కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఏ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటే ఆ కంపెనీలో చేసేలా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. మూడు కంపెనీల్లో ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగమేళా చాలా బాగుంది. వేలాదిమందికి ఉద్యోగాలు లభించాయి. మంత్రి శ్రీనన్నకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– రాణి, మహబూబ్నగర్
ఇంత పెద్దఎత్తున ఏర్పాటు చేసిన జాబ్మేళాను ఎప్పుడూ చూడలేదు. ప్రతి కంపెనీ కూడా మీకు ఉద్యోగం ఇస్తాం అంటున్నారు. ఇన్ని కంపెనీలు రావడం వల్ల మంచి ఉద్యోగం పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంత మంచి ఆలోచన చేసి ఉద్యోగాలు పొందేందుకు సహకరించిన మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి న్ని ఉద్యోగమేళాలు ఏర్పాటు చేసి మరింత మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషిచేయాలి.
– వీరప్రతాప్రెడ్డి, దేవరకద్ర
సార్ మాది బీద పరిస్థితి. ఇటీవల్లే మాకు బెడ్రూం ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగ మేళాలో నెలకు రూ.30వేల ఉద్యోగం లభించింది. స్వరాష్ట్రంలో మా బతుకులు మారాయి సార్..మీ వల్లే ఇల్లు వచ్చింది..జాబ్ కూడా వచ్చింది.. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– నందిని, వీరన్నపేట