పెంట్లవెల్లి, జూలై 2 : ఎనిమిదేళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని కొండూరు-శింగవరం గ్రామాల మధ్య వ్యవసాయ పొల్లాల సమీపంలో పొంగులోనిగుట్ట వద్ద శనివారం చోటుచోసుకున్నది. కొల్లాపూర్ సీఐ యాలాద్రి కథనం ప్రకారం..ఉదయం 10గంటల సమయంలో వ్యవసాయ పొలాలకు వెళ్తున్న కొందరు రైతులు కాలిన మృతదేహాన్ని చూసి పెంట్లవెల్లి పోలీసులకు సమాచారం అందించారు.
సీఐ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని బాలుడి శవాన్ని పరిశీలించినట్లు తెలిపారు. బాలుడు సుమారు 8ఏండ్లు ఉండొచ్చని అంచనా వేశారు. నల్లని జీన్స్ పాయింట్, ఆరెంజ్ కలర్ షర్ట్ ధరించినట్లు సీఐ వివరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఏమైన వివరాలు తెలిస్తే 9704895857, 8341612036 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.