కోయిలకొండ, జూలై 2 : ప్రైవేట్కు దీటు గా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నట్లు ఎంపీపీ శశికళాభీంరెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడంతోపాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూ నిఫాం, మధ్యాహ్నభోజనం అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా అధునాతన వసతులతో పాఠశాల భవనాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం పదోతరగతి పరీక్షా ఫలితాల్లో 10/10 జీపీ ఏ సాధించిన అభినవశ్రీని అభినందించా రు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, ఎం పీటీసీ ఆంజనేయులు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మల్లయ్య, ఎస్ఎంసీ చైర్మన్ నర్సింగమ్మ, హెచ్ఎం వెంకట్జీ, నాయకులు జగన్గౌడ్, రాజవర్ధన్రెడ్డి, నాగరాజు, రామస్వామి, శ్యామ్ పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, జూలై 2 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు పలువురు దాతలు పెన్నులు, నోట్పుస్తకాలను అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. జడ్చ ర్ల మున్సిపాలిటీలోని పాతబజార్ హరిజనవాడ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎన్ఆర్ఐ రవి నోట్పుస్తకాలు, జామెట్రీ బాక్సుల ను అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం ఉమాదేవి, ఉపాధ్యాయులు ఎం.వాణి, సత్యశీలారెడ్డి, సతీశ్కుమార్, టి.వాణి, మన్యం, రామకృష్ణ, స్వర్ణలత, రవికుమార్గౌడ్, అలివేలమ్మ పాల్గొన్నారు.
అదేవిధం గా మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నేషనల్ నీబుల్ ఉమెన్స్ రైట్స్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు భాస్కరాచారి ఆధ్వర్యంలో నోట్పుస్తకాలు, పెన్ను లు, పలకలను పంపిణీ చేశారు. కార్యక్రమం లో సంస్థ సభ్యులు శ్రీనివాస్గౌడ్, జహంగీర్పాషా, ప్రసాద్, సర్పంచ్ శ్రీనివాస్, వార్డుసభ్యుడు జంగయ్య, బాలరాజుగౌడ్, హెచ్ ఎం ఎం.సత్యనారాయణ, ఉపాధ్యాయులు సత్యం, శ్రీలత పాల్గొన్నారు.