జడ్చర్ల, జూలై 2: జడ్చర్ల సమీపంలో 44వ జాతీయరహదారిపై ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి దాదా పు 300మీటర్ల జడ్చర్ల పట్టణం వైపు దాదాపు 300మీటర్ల మేర సర్వీసురోడ్డు నిర్మాణానికిగానూ జాతీయరహదారిని అనుసరించి మట్టిని తవ్వారు. ఆ తర్వాత దానిని పట్టించుకోలేదు. జాతీయరహదారిపై ఉన్న బూరెడ్డిపల్లి గ్రామం స్టేజీ దగ్గర వాహనదారులు రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. పలువురు మృత్యువాత పడగా, మరికొందరు క్షతగాత్రులవుతున్నారు.
ఇది గమనించిన నేషనల్హైవే అధికారులు బూరెడ్డిపల్లి నుంచి జడ్చర్ల ఫ్లైఓవర్ చివరివరకు సర్వీసు రోడ్డును నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ఆ సమయంలో బూరెడ్డిపల్లి స్టేజీ నుంచి ఇండియన్ఆయిల్ పెట్రోల్బంక్ వరకు దాదాపు 300మీటర్ల మేరకు రోడ్డును నిర్మించారు. అక్కడి నుంచి జడ్చర్ల వద్దగల ైప్లె ఓవర్ చివరివరకు సర్వీసు రోడ్డు వేయా ల్సి ఉంది. అందులో ఫ్లైఓవర్ చివరినుంచి బూరెడ్డిపల్లి వైపు దాదాపు 200 మీటర్ల వరకు బీటీరోడ్డు నిర్మించారు. కాగా మధ్యలో దాదాపు 300 మీటర్ల పొడవునా వేయాల్సిన బీటీరోడ్డు వేయకుండా వదిలేశారు. ఆమధ్యలో రోడ్డు వేయడానికి మట్టిని తవ్వారు.
ఇది తవ్వికూడా దాదాపుగా రెండేళ్లకుపైగానే అవుతుంది. మట్టిని తవ్వడం వలన అటువైపు ఉన్న కాలనీవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు తవ్వకపోయినా రోడ్డుపక్క నుంచి వెళ్లేవారమని, రోడ్డునిర్మాణం కోసం మట్టినితవ్వి వదిలేయడంతో వర్షాలు పడినప్పుడు చెరువులా మారుతుందని, దీంతో వాహనదారులు అటువైపునుంచి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళలో అయితే గుంతలను గమనించని వాహనదారులు ముందుకు రోడ్డు ఉందనే భావనతో అలానే ముందుకు వెళ్లడంతో బురదలో ఇరుక్కుపోతున్నారు. 44వ జాతీయరహదారిపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రయాణం చేస్తూనే ఉన్నా అక్కడ రోడ్డుకోసం మట్టిని తవ్విన విషయాన్ని మాత్రం పట్టించుకోవడంలేదని వాహనదారులు వాపోతున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి నిర్మించే సర్వీసు రోడ్డును అధికారులు మరచిపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శంగా మారింది. ఇప్పటికైనా హైవే అధికారులు స్పందించి మిగిలిన సర్వీసురోడ్డును నిర్మించి వాహదారుల ఇబ్బందులు తొలగించాల్సిన అవసరం ఎతైనా ఉంది.