మహబూబ్నగర్టౌన్, జూలై 2 : క్రికెట్లో జిల్లా క్రీడాకారులు రాణించి రంజీ జట్టుకు ఎం పిక కావాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత క్యాంపునకు ఉమ్మడి జిల్లా అండ ర్-14,16 జట్ల ఎంపికలను శనివారం బో యపల్లి సమీపంలోని ఎండీసీఏ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను అన్ని విధా లా ప్రోత్సహిస్తామని తెలిపారు. 30మందిని ప్రాబబుల్స్కు ఎంపిక చేశామని, శిక్షణ ఇచ్చి తుది జట్టును ఎంపిక చేస్తామన్నారు. కార్యక్ర మంలో క్రికెట్ సంఘం ప్రతినిధులు సురేశ్కుమార్, అశోక్, గోపాలకృష్ణ పాల్గొన్నారు.