ఆత్మకూరు, జూన్ 22 : పట్టణం నలుమూలలా పచ్చదనాన్ని పెంపొందించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా పేర్కొన్నారు. బుధవారం ఆత్మకూరులో జరిగిన ప్రగతి పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. చెరువుకట్టను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. అదేవిధంగా పట్టణంలోని అన్ని రహదారులపై అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పా టు చేయాలని సూచించారు. శ్మశాన వాటిక పనులను పర్యవేక్షించి ప్రాంగణమంతా పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలన్నారు.
ఈ సందర్భంగా పట్టణప్రగతి భాగంగాలో పట్టణంలో చేపట్టిన పలు పనులను ఆమె పరిశీలించారు. బస్టాండ్లో నూతనంగా ఏర్పా టు చేసిన హరితవనాన్ని కలెక్టర్ సందర్శించారు. తదనంతరం పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లబ్ధిదారులందరికీ పౌష్టికాహారం తప్పక అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం మం డలంలోని జూరాల ఉన్నత పాఠశాలలో మన ఊరు-మనబడి పథకంలో భాగంగా జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్, వైస్చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, ము న్సిపల్ కమిషనర్ రమేశ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఆయాశాఖల అధికారులు, జూరాల పాఠశాల ఉపాధ్యాయ బృందం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.