పెంట్లవెల్లి, జూన్ 22 : వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రం లో చోటు చేసుకున్నది. ఎ స్సై రమేశ్ కథనం మేరకు వి వరాలు.. పెంట్లవెల్లికి చెంది న ఇటిక్యాల శేఖర్(45) అ తడికున్న ఐదెకరాల పొలంలో వ్యవసాయం చేసేవాడు. మంగళవారం పనులు ము గించుకొని భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ఆవరణలోని వరండాలో నిద్రించాడు.
మధ్యరాత్రి సుమారు 11:30 గంటల సమయంలో దా యాదులైన వెంకటమ్మ, శేఖర్, ఎల్లస్వామి, రామకృష్ణ ఇంటి ప్రహరీపై నుంచి ఇం ట్లోకి చొరబడి శేఖర్పై గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు. భూ తగాదాలు ఉండడం వ ల్లే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య ప ద్మ, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.