మిడ్జిల్, జూన్ 22 : దేశానికి అన్నం పెట్టే రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని దోనూర్లో బుధవారం గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్తో కలిసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వస్పులలో రూ.12.60లక్షలతో నిర్మించిన రైతువేదికను ప్రారంభించారు. అలాగే పాఠశాలలో రూ.24లక్షలతో నిర్మించిన నాలుగు అదనపు గదులు, క్రీడా ప్రాంగణం, పల్లెప్రకృతి వనం, వైకుంఠధామాలను ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే నిధులు రూ.5లక్షలతో యాదవ సంఘ భవనం, మనఊరు-మనబడి కార్యక్రమంలో భా గంగా రూ.38లక్షలతో పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తున్నదన్నారు. రైతు ల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో అన్ని గ్రామాల్లో పచ్చద నం, పరిశుభ్రత పెరగడంతోపాటు ప్రజలకు మౌలి క సదుపాయలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మనఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, జెడ్పీటీసీ శశిరేఖ, ఎంపీపీ కాంతమ్మ, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఎమ్మార్పీస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జంగయ్య, శ్రీనివాస్బహుదుర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జంగారెడ్డి, సర్పంచులు మధుసూదన్రెడ్డి, సునీత, ఎంపీటీసీలు సుదర్శన్, నర్సింహ, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల, జూన్ 22 : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 15మంది దివ్యాంగులకు మూడుచక్రాల స్కూటీలను ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో స్కూటీ డ్రైవింగ్ వచ్చే దివ్యాంగులందరికీ పంపిణీ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాను 10మందికి స్కూటీలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
అరబిందో ఫార్మా నిర్వాహకులు మొదట 15 స్కూటీ లు ఇచ్చారని, ఇంకా 35 స్కూటీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అవరసమున్న దివ్యాంగులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకుంటే విడుతల వారీగా అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్చందర్, సర్పంచులు రాజేశ్వర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, అశోక్గౌడ్, నవాబ్పేట జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహులు, సంగీత, నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, అరబిందో ఫార్మా ప్రతినిధి మల్లికార్జున్, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్రెడ్డి, ఉమాశంకర్గౌడ్, దేవా, జ్యోతీకృష్ణారెడ్డి, లత, చైతన్య, సతీశ్, కొండల్, టీఆర్ఎస్కేవీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, దోరేపల్లి రవీందర్, ఇర్షాన్, తిరుపతిరెడ్డి, నాగిరెడ్డి, శంకర్నాయక్, ముడా డైరెక్టర్లు ఇంతియాజ్ఖాన్, శ్రీకాంత్ పాల్గొన్నారు.