మహబూబ్నగర్, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2023.. పాలమూరుకు అచ్చొచ్చిన సంవత్సరం. ఈ ఏడాది ప్రారంభంలోనే మూడు వైద్యపరమైన కళాశాలలకు అనుమ తి లభించింది. మూడు కాలేజీ లు ఒక్క జిల్లాకే రావడం రాష్ట్రం లో ఇదే మొదటిసారి. పారామెడిక ల్, నర్సింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రా రంభం కాగా.. ఫిజియోథెరపీ కళాశాలకు జనవరిలోనే ముహూర్తం ఖరారు చేశారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవతో ఏకంగా మూ డు వైద్య కాలేజీలు ఏర్పాటు కావడంతో విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పారామెడికల్ కోర్సులకు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని తొమ్మిది మెడికల్ కాలేజీల్లో సీట్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. పాలమూరు మెడికల్ కాలేజీలో ఆరు కోర్సులకుగానూ 70 సీట్లు కేటాయించారు. డిసెంబర్ 22న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పాత కలెక్టరేట్లో సూపర్స్పెషాలిటీ దవాఖాన శంకుస్థాపనకు వచ్చినప్పుడు మంత్రి శ్రీనివాస్గౌడ్ పారామెడికల్ కాలేజీ గురించి ప్రస్తావించారు. మంత్రి హరీశ్రావు వెంటనే స్పందించి పారామెడికల్ కో ర్సులను మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ మేరకు 24 గంటల్లోనే మహబూబ్నగర్ మెడికల్ కాలేజీకి 70 సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదివరకే నర్సింగ్ కాలేజీ కూ డా మంజూరు కాగా జనవరిలోనే అడ్మిషన్లు ప్రారంభం కావ డం, ఫిజియోథెరపీ కాలేజీకి కూడా ఇదే నెలలో ఆంధ్ర మహిళాసభ ముహూర్తం ఫిక్స్ చేయడంతో విద్యార్థులు ఆనందంలో మునిగితేలుతున్నారు. చాలామంది విద్యకు దూరమవుతున్న త రుణంలో విద్యార్థుల ముంగిట్లోనే ఉన్నత విద్యావకాశాలను తీ సుకురావడం అభినందనీయమని విద్యార్థుల తల్లిదండ్రులు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఏడాది జిల్లాకు వైద్యనామసంవత్సరంగా మిగిలిపోనున్నదని అభిప్రాయపడుతున్నారు.
పారామెడికల్ కాలేజీలో 70 సీట్లకు అనుమతి..
రాష్ట్రంలో వైద్య విద్యకు అనుబంధంగా పారామెడికల్ సీ ట్లకు అదే తరహాలో డిమాండ్ ఉన్నది. అయితే, ఈ కోర్సులు ఎంపిక చేసిన కళాశాలల్లో మాత్రమే చదవడానికి అర్హత ఉం డేది. తాజాగా కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ మెడికల్ అండ్ హె ల్త్ కోర్సులకు కూడా ప్రాధాన్యత కల్పిస్తూ తొమ్మిది మెడికల్ కా లేజీల్లో హెల్త్ సైన్స్ బీఎస్సీ కోర్సులకు అనుమతిచ్చింది. ఇంటర్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసిన విద్యార్థుల మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు కేటాయించనున్నారు. తాజాగా మహబూబ్నగర్ మెడికల్ కాలేజీకి 70 సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బీఎస్సీ అనెస్తీషియాలో 10, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో 10, రెస్పీరేటరీ థెరపీ టెక్నాలజీలో 10, రేడియాలజీ ఇ మేజింగ్ టెక్నాలజీలో 20, మెడికల్ రికార్డ్ సైన్స్లో 10, ఆప్టోమెట్రిక్ టెక్నాలజీలో 10 సీట్లు కేటాయించారు. విద్యార్థులు ఈ నెల 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అడ్మిషన్లు పొందిన వారికి మెడికల్ కాలేజీలో తరగతులు బోధించనున్నారు.
నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలకు కూడా..
మహబూబ్నగర్ జిల్లాలో వైద్యపరమైన కోర్సులకు చాలా డిమాండ్ ఉన్నది. అయితే, ఇందుకు తగినట్లు ప్రభుత్వ కళాశాలలు లేకపోవడంతో ప్రైవేట్లో చేరుతున్నారు. ఈ క్రమంలో బోగస్ ఇనిస్టిట్యూట్లు కూడా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. చాలా ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో సరిగ్గా బోధించకపోవడంతో.. కోర్సు పూర్తయ్యాక ఏం చేయాలో తెలియక విద్యార్థులు తమ కెరీర్లో విఫలమయ్యారు. దీనికి చెక్పెట్టేందుకు ప్రభుత్వమే ప్రతి జిల్లాకో నర్సింగ్ కాలేజీలను కేటాయించింది. తాజాగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవతో నర్సింగ్ కాలేజీకి అనుమతి లభించింది. అడ్మిషన్లు కూడా ప్రారంభమై ఇదే నెలలో కళాశాలను ప్రారంభించనున్నారు. ఇటీవల మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు ఆంధ్ర మహిళా సభ తరఫున ఉచితంగా ఫిజియోథెరపీ కాలేజీని మహబూబ్నగర్లో ప్రారంభించేందుకు మంత్రి శ్రీనివాస్గౌడ్తో చర్చించారు. మంత్రి వెంటనే స్పందించి, అందుకు కావాల్సిన ఏర్పాట్లు, సహకారం అందించారు. దీంతో ఈ నెలలోనే ఫిజియోథెరపీ కాలేజీని ప్రారంభించనున్నారు. త్వరలో అడ్మిషన్ల ప్రక్రియకు తుదిరూపం ఇవ్వనున్నారు. ప్రభుత్వ దవాఖాన పక్కనే ఆంధ్ర మహిళా మహాసభ స్థలంలోనే కాలేజీని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు..
70 ఏండ్లుగా పాలమూరు అభివృద్ధి గురించి పట్టించుకో ని వారు.. నేడు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాగునీరు, రోడ్లు, వార్డులను బాగుచేయని వాళ్లు.. ఇవా ళ పాలమూరు అభివృద్ధి చెందుతుంటే జీర్ణీంచుకోలేకపోతున్నారు. వెనుకబడిన జిల్లాకు ఈ ఏడాది మూడు కళాశాలలు వచ్చాయి. వీటితో విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారనున్నది. ఉన్నత చదువులు ఇక్కడే చది వి.. ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే వీలుంటుంది. పారామెడికల్, ఫిజియోథెరపీ కోర్సులకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నది. ప్రభుత్వం ఇక్కడి విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని కాలేజీలను ఏర్పాటు చేసింది. జిల్లా బాగుపడాలనే ఉద్దేశంతోనే అన్ని పనులు చేపడుతున్నాం. పార్టీలకతీతంగా అభివృద్ధికి సహకరించాలి.
– డా.వి.శ్రీనివాస్గౌడ్,ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి