మహబూబ్నగర్, జూన్ 27:(నమస్తే తెలంగాణ ప్రతినిధి):అమెరికన్ తెలంగాణ సొసైటీ (ఏటీఎస్), తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలోహన్వాడ మండలం పెద్దదర్పల్లిలో కొవిడ్ దవాఖానను ఏర్పాటు చేశారు. కరోనా కల్లోలాన్ని ఎదుర్కొనేందుకు ఏటిఎస్, టీటా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగో దవాఖాన ఇది.
కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైరస్ సోకిన వారికి వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న వారికి ఈ దవాఖాన ఎంతో ఉపయోగపడుతుందని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తలా తెలిపారు. నారాయణపేట జిల్లా మాగనూర్లో తొలి దవాఖానను గత నెల టీటా ప్రారంభించింది. టీటా ఆధ్వర్యంలోవిజయవంతంగా సేవలు అందిస్తున్న ఈ దవాఖానకు కొనసాగింపుగా మరో రెండు కేంద్రా లు ప్రారంభమయ్యాయి. తాజాగా మరో కేంద్రం పెద్దదర్పల్లి అంగన్వాడీ కేంద్రంలో కొవిడ్ దవాఖాన ప్రారంభమైంది. ఈ దవాఖాన ఏర్పాటు దాత, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నివాసి గుముడాల శ్యామ్ ప్రసాద్గౌడ్ తండ్రి బాలరాజుగౌడ్ ఈ కేంద్రాన్ని ప్రారంభించగా స్థానిక డీఎస్పీ శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ ప్రజలు అమెరికాలో ఉన్నవైద్యులతో అనుసంధానమయ్యారు.
దవాఖాన పనితీరు ఇలా…
సంప్రదాయ వైద్య సహాయం పనితీరు రూపంలోనే వసతులన్నీ ఉంటాయి. పీపీఈ కిట్లతో వాలంటీర్లు సిద్ధంగా ఉంటారు. స్థానిక ల్యాబ్లతో ఒప్పందం కుదుర్చుకొని ఉచిత పరీక్షలు నిర్వహిస్తారు. ఓపీ ద్వారా రోగి వీడియో కన్సల్టింగ్ రూపంలో వైద్యులతో అనుసంధానమవుతా రు. పీహెచ్సీలో కొవిడ్ నిర్ధారణ అయిన వారికి ఇక్కడ వైద్య సహాయం వీడియో కన్సల్టింగ్ రూపంలో సాగుతుంది. ఇక్కడ సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) సీఎంఎపీ పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. ఈ దవాఖానలో ఇద్దరు వైద్యులు ఈ సెంటర్కు వచ్చేరోగులకు సహాయంగా ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నారు. మరోఇద్దరు హెల్త్ వలంటీర్లు ఈ కేంద్రంలో ఉండి సేవలుఅందించనున్నారు. టీటాతన యొక్క టి.కన్సల్ట్ టెక్నాలజీ, క్షేత్రస్థాయిలో నిర్వహణను చూస్తుందని సందీప్ తెలిపారు.
కరోనా సమయంలో మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యసేల కోసం టీటా ఆధ్వర్యంలో కొవిడ్ దవాఖనలు ఏర్పాటు చేస్తున్నామని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల తెలిపారు. ఏటీఎస్ ద్వారా దాతలు ముందుకు రావడం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు.