మహబూబ్నగర్, జూన్ 27 : ఆరోగ్యం బాగుం దా..? ఫించన్ వస్తుందా..? అంటూ ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాంమందిర్ చౌరస్తా, గ్రంథాలయం చౌరస్తా తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడారు. అభివృద్ధి కోసం ప్రతి క్షణం పరితపిస్తున్నామని, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి సమస్యనూ ప రిష్కరించుకుంటూ ముందుకు సాగుదామన్నారు. కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, నాయకుడు శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.
అందరూ ఆరోగ్యంగా జీవించాలి
ప్రతి కుటుంబం సంతోషంగా జీవించాలని సంకల్పంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతం గా అమలు చేస్తున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్యకు వైద్య ఖర్చుల నిమి త్తం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.2.50 లక్షల విలువగల చెక్కులను ఆదివారం హైదరాబాద్లో బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. అలాగే అథ్లెటిక్ కోచ్ సునీల్కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వీరన్నపేట ప్రాంతానికి చెందిన భాను విద్యుత్ ప్రమాదంలో మృతి చెందగా, కుటుంబ సభ్యులకు అథ్లెటిక్ కోచ్ సునీల ఆధ్వర్యంలో సమకూర్చిన రూ.50 వేల సాయాన్ని మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో నూ మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ.నర్సింహులు తదితరులు ఉన్నారు.