ప్రభుత్వ సూచనలు పాటించాలి
పాజిటివ్ వ్యక్తులు బయట తిరిగితే కేసులు
జడ్చర్లలో త్వరలోనే 20 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, మే 17 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం వి ధించిన లాక్డౌన్తో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయ ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్లలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, వైద్య, మున్సిప ల్, పోలీసు శాఖల అధికారులతో లాక్డౌన్, పాజిటివ్ కేసు లు, కరోనా పరీక్షలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు సకాలంలో చికిత్స తీసుకోవాలని సూ చించారు. చాలామందికి లక్షణాలు లేకుండానే పాజిటివ్ వ స్తుందని, చిన్నపాటి లక్షణాలు ఉంటున్నాయని తెలిపారు. అలాంటి వారు హోంఐసోలేషన్లో ఉండి చికిత్స పొందాల ని తెలిపారు. ఐసోలేషన్లో ఉండే వారికి ఇంటి దగ్గర తగిన వసతులు లేకుంటే బాలానగర్ ప్రభుత్వ దవాఖానలో 30 పడకలు ఉన్నాయని, అక్కడ చికిత్స పొందవచ్చన్నారు. కరో నా పాజిటివ్ వచ్చిన వారు బయట తిరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సడలింపు సమయంలో అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారని, అలాంటి వారిని గుర్తిం చి పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలానగర్ మండల కేంద్రంలోని సంతబజార్లో రోడ్డుకు ఇరువైపు లా దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయని, అందుచేత దుకాణాలను వేరే ప్రాంతంలోకి మార్చాలని సీఐకి సూచించారు.
పా జిటివ్ వ్యక్తుల ఇండ్ల దగ్గర సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయడంతోతోపాటు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని తెలిపారు. బా దేపల్లి కమ్యూనిటీ దవాఖానలో హిర్కో ఫార్మా ఆధ్వర్యంలో త్వరలోనే 20 ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. దేశంలోనే మొట్టమొదటగా రాష్ట్రంలో జ్వరసర్వే నిర్వహించగా, మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. జ్వరం వచ్చిన వారిని గుర్తించి మందులను అందించి ఆదిలోనే అరికడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన జ్వరసర్వేను కేంద్రం ఇతర రాష్ర్టాలలో కూడా అమలు చేస్తున్నదన్నారు. సమావేశంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీరవీందర్, వైస్ చైర్పర్సన్ సారికారామ్మోహన్, పీఏసీసీఎస్ అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, మున్సిపల్ కమిషనర్ సునీత, బాదేపల్లి సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ సోమశేఖర్, అర్బన్ హెల్సెంటర్ డాక్టర్ శివకాంత్, రూరల్ సీఐ శివకుమార్, ఎస్సై షంషొద్దీన్, డిప్యూటీ తాసిల్దార్ సునీల్, ఆర్ఐ రాఘవేంద్ర తదితరులు ఉన్నారు.