వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అరెస్టు
రూ.2 లక్షల 62వేలు రికవరీ
10 ద్విచక్రవాహనాలు, 11 తులాల బంగారం, 99 తులాల వెండి స్వాధీనం
మహబూబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 12 : వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు మహబూబ్నగర్ పోలీసులకు చిక్కారు. ఇందులో ఒకరిపై 15 దొంగతనాల కేసులు, ఒక హత్యకేసూ ఉన్నాయి. వారి నుంచి పోలీసు లు రూ.2లక్షల 62వేలు రికవరీ చేయడంతోపాటు, 10 ద్విచక్రవాహనాలు, 11 తులాల బంగారం, 99 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
జల్సాలకు అలవాటుపడి..
దేవరకద్రకు చెందిన పడమటి రమేశ్రెడ్డి (31) రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటుపడ్డాడు. వ్యాపారం కలిసి రాకపోవడంతో జ ల్సాలకు డబ్బు దొరక్క సులభంగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు ఏటీఎంలను ఎంచుకున్నాడు. ఏటీఎం కేంద్రా ల్లో నగదు డ్రా చేస్తున్నట్లు నటిస్తూ, డబ్బులు డ్రా చేయడానికి ఇబ్బందిపడేవారిని ఎంపిక చేసుకుని డబ్బులు డ్రా చేసేందుకు సాయం చేస్తానని చెప్పేవాడు. వారి ఏటీ ఎం కార్డులు తీసుకుని పిన్ నెంబర్ తెలుసుకుని డబ్బులు రావడంలేదని.. వారికి తన వద్ద ఉన్న బ్లాక్ అయిన కార్డు ఇచ్చి ఆ తర్వాత అసలు కార్డుతో వేరే ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేవాడు. జడ్చర్ల సిగ్నల్గడ్డ దగ్గరున్న ఏటీఎంలో ఓ వ్యక్తి కార్డు మార్చి రూ. 33.400 డ్రా చేయగా, సిద్దిపేట జిల్లా పరిధిలో మరో వ్యక్తి ఏటీఎం కార్డు ద్వారా రూ.25వేలు, గజ్వేల్లో రూ, 10,500, ములుగు జిల్లా లో రూ. 2లక్షలు డ్రా చేశాడు. ఇలా మొత్తం రూ.2,68, 900 లక్షలు డ్రా చేయగా, అతడిని అరెస్ట్ చేసి రూ. 2,6 2,900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
15 కేసుల్లో నిందితుడు ఎరుకలి శ్రీను
నవాబ్పేట మండలం చెన్నారెడ్డిపల్లికి చెందిన ఎరుకలి శ్రీను (26) 15 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. తా ళం వేసిన ఇంట్లో దొంగతనాలు చేయడం, ద్విచక్రవాహనాలను అపహరించడం పనిగా పెట్టుకున్నాడు. ఇప్పటివరకు ఐదు ఇండ్లల్లో దొంగతనం చేయడంతోపాటు 10 ద్విచక్రవాహనాలు అపహరించాడు. శనివారం జడ్చర్లలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన ఎరుకలి శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలు బయటపడ్డాయి. జడ్చర్ల పీఎస్ పరిధిలోని పెద్దపల్లి గ్రామంలో రూ.1.50లక్షలు విలువ చేసే నగలు, నగదు, ఇదే పీఎస్ పరిధిలోని ఖానాపూర్లో రూ.95వేలు విలువ చేసే నగలు, రాజాపూర్ పీఎస్ పరిధిలోని దొడ్లపల్లిలో రూ.35వేలు విలువచేసే నగలు, కుచ్చరకల్లో రూ.10వేలు విలువచేసే నగలు, నవాబ్పేట మండలం కొండాపూర్లో రూ.1.25లక్షలు విలువచేసే నగలు, వెండి ఆభరణాలు అపహరించాడు.
వీటితోపాటు జడ్చర్ల, కోస్గి, వంగూర్, మహబూబ్నగర్ వన్టౌన్ పోలీసుస్టేషన్ల పరిధిలో 10 ద్విచక్రవాహనాలను చోరీకి పాల్పడ్డాడు. ఇతడి నుంచి 10 ద్విచక్రవాహనాలు, 11 తులాల బంగారం, 99తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రెండు కేసుల్లో నిందితులిద్దరినీ రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎరుకలి శ్రీనుపై గతంలో ఓ హత్య కేసు కూడా ఉందని, తన స్నేహితుడితో కలిసి 2014లో శంషాబాద్ పీఎస్ పరిధిలో ఓ మహిళను హత్యచేసి జైలుకు వెళ్లి బెయిల్పై బయటికి వచ్చాడని తెలిపారు. ఈ రెండు కేసుల్లో చక్కటి పనితీరు కనబర్చి నిందితులను అరెస్టు చేయడంతోపాటు ప్రాపర్టీని రికవరీ చేసిన జడ్చర్ల సీఐ వీరస్వామీ, ఎస్సై శంషొద్దీన్, కానిస్టేబుళ్లు ఆది బాలచంద్రుడు, దాసు, మల్లేశ్వర్, శంకరయ్య, శ్రీనివాస్, చైతన్యను ఎస్పీ అభినందించి రివార్డులతో సత్కరించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీధర్, సీఐ వీరస్వామి ఉన్నారు.