చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
చైర్పర్సన్గా దోరేపల్లి లక్ష్మి
వైస్ చైర్పర్సన్గా పాలాది సారిక
కొవిడ్ నిబంధనల మేరకు ప్రమాణ స్వీకారం
జడ్చర్లటౌన్, మే 7: జడ్చర్ల మున్సిపల్ పాలకవర్గం కొలువుదీరింది. జడ్చర్ల మున్సిపాలిటీ తొలి చైర్పర్సన్గా దోరేపల్లి లక్ష్మి, వైస్ చైర్పర్సన్గా పాలాది సారిక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు మున్సిపల్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్, రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు సుదర్శన్రెడ్డి సమక్షంలో నూతన పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మొదటగా ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన 23మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ తరఫున గెలిచిన ఇద్దరు హాజరయ్యారు. ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితోపాటు కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన సీట్లలో కూర్చున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమ నిబంధనలు వివరించి కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కాంగ్రెస్ తరఫున హాజరైన ఇద్దరు సభ్యులతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియను మొదలు పెట్టారు. ముందుగా చైర్పర్సన్గా దోరేపల్లి లక్ష్మీని 23వ వార్డు కౌన్సిలర్ ఉమాశంకర్గౌడ్ ప్రతిపాదించగా, 25వ వార్డు కౌన్సిలర్ లత బలపరిచారు. అదే విధంగా వైస్ చైర్పర్సన్గా పాలాది సారికను 4వ వార్డు కౌన్సిలర్ కాటమోని శంకర్ ప్రతిపాదించగా, 6వ వార్డు కౌన్సిలర్ రమేశ్ బలపరిచారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఒక్కో నామినేషన్ రావడంతో వీరిద్దరిని ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రకటించారు. ఆ తర్వాత చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్గా ఎన్నికైన దోరేపల్లి లక్ష్మీ, పాలాది సారికతో ప్రమాణం చేయించారు. అనంతరం వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శాలువాలతో సత్కరించారు. అలాగే తెలంగాణ సివిల్ సప్లయి చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, సంగీత, నాటక అకాడమీ రాష్ట్ర చైర్మన్ బాద్మి శివకుమార్ నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
పట్టణ అభివృద్ధికి కృషి చేస్తా
మున్సిపల్ అభివృద్దికి కృషి చేస్తా. ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. పాలకవర్గ సభ్యుల సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తాను. చైర్పర్సన్గా ఎన్నికయ్యేందుకు సహకరించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితోపాటు కౌన్సిలర్లకు దన్యవాదాలు.