రిసెప్షన్ వర్టికల్ ఇన్చార్జి రాజేందర్
నారాయణపేట, మే 7 : పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులపై సానుకూలంగా స్పందించి వారి మనసులో భద్రతా భావాన్ని, విశ్వాసాన్ని పెంపొందించేలా కృషి చేయాలని రిసెప్షన్ వర్టికల్ ఇన్చార్జి రాజేందర్ సూచించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల రిసెప్షన్ అధికారులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి కారణంగా పోలీస్ స్టేషన్లలో కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యను ఓపికగావిని అర్థం చేసుకొని, పిటిషనర్ను పై అధికారికి కలిపించి వారికి సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించడంలో ముఖ్య పాత్ర వహించాలన్నారు. నూతన సాంకేతిక విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని, 5ఎస్ విధానం అమలు చేయాలని, సిస్టం రికార్డ్స్, ఫైల్స్ క్రమ పద్దతిలో నిర్దేశిత ప్రదేశంలో సులభంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ శిక్షణలో జిల్లాలోని రిసెప్షన్ పోలీస్ అధికారులు, ఐటీ కోర్ టీం సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.