వనపర్తి, జూన్ 29 : అనారోగ్య బారిన పడి మెరుగైన వైద్యం చేయించుకున్న బాధితులకు సీఎం సహాయనిధి ఎ ల్లప్పుడూ అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. బుధవారం నియోజకవర్గంలోని 54 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.17.26 లక్షల విలువ గల చెక్కులను మంత్రి ని రంజన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అనంతరం బాధితులతో కలిసి టిఫిన్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, బండారుకృష్ణ, కెంచె రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆవుల రమేశ్, మండల యువజన అధ్యక్షుడు చిట్యాల రాము, నాయకులు గోపాల్, ప్రేమ్నాథ్రెడ్డి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.‘