మహ్మదాబాద్, జూన్ 29 : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో క్రీడాప్రాంగణం, వైకుంఠధామం, నంచర్లలో క్రీడాప్రాంగణాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి సాధించాయని తెలిపారు. గత పాలకులు గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలతో అన్ని గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెరిగిందని పేర్కొన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని గ్రామపంచాయతీల్లో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
యువత సద్వినియోగం చే సుకోవాలని సూచించారు. అదేవిధంగా రైతులు, పేదల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తు న్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. రైతుబం ధు, వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీసీఎస్ వైస్చైర్మన్ లక్ష్మీనారాయణ, కోఆప్షన్ సభ్యుడు సలీం, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గిరిధర్రెడ్డి, ఎంపీడీవో రూపేందర్రెడ్డి, సర్పంచులు అనసూయ, పార్వతమ్మ, రాఘవేందర్, ఎంపీటీలు పద్మ మ్మ, చెన్నయ్య, పంచాయతీ కార్యదర్శులు వెంకటస్వామి, రాఘవేందర్రెడ్డి, ఏపీవో హరిశ్చంద్రుడు, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు భిక్షపతి, రవీందర్రెడ్డి, గోపాల్రెడ్డి, మాజీ ఎంపీటీసీ జనార్దన్గౌడ్, తిర్మల్రెడ్డి, హన్మయ్య, వెంకట్రెడ్డి, కిష్టయ్య, సాబేర్, రాజశేఖర్గౌడ్, కేశవులు పాల్గొన్నారు.