నారాయణపేట టౌన్, మే 26 : ప్రభుత్వ పాఠశాలల బ లోపేతానికి ప్రభుత్వం కృషి చేసున్నది. ప్రభుత్వ పాఠశాల ల్లో చదువుతున్న విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టింది. అందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు విద్యాశాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులతో కలిసి వివిధ రకాల పనులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయా పాఠశాలలకు సంబంధించి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నిధులను మంజూ రు చేసి ఎంపికైన బడుల్లో పనులు చేపట్టారు. పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం తో అధికారులు ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా కృషి చేస్తున్నారు. అయితే రూ.30లక్షల వ్యయంతో పనులు పూర్తయ్యే ప్రాథమిక పాఠశాలల పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.30లక్షలకు మించి ఖర్చు అయ్యే ఉన్న త పాఠశాల పనులకు టెండర్లు కావాల్సి ఉందని, వాటి ప నులు ఆలస్యమవుతాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను డీఈలు, ఏఈలు, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
మొదటి విడుతగా 174 పాఠశాలలు ఎంపిక
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో జిల్లాలో మొద టి విడుతగా 174 పాఠశాల లను ఎంపిక చేశారు. జిల్లాలో మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలు ఉ న్నాయి. మక్తల్ నియోజకవర్గంలో 59 పాఠశాలలను ఎంపిక చేయగా అందులో కృష్ణ మండలంలో 7, మాగనూర్ మండలంలో 8, మక్తల్ మండలంలో 21, నర్వ మండల ంలో 9, ఊట్కూర్ మండలంలో 16 పాఠశాలలు ఉన్నాయి. అలాగే నారాయణపేట నియోజకవర్గం లో 64 పాఠశాలలు ఎంపిక చేయగా దామరగిద్ద మండలం లో 17 పాఠశాలలు, ధన్వాడ మండలంలో 12 పాఠశాల లు, మరికల్ మండలం లో 9 పాఠశాలలు, నారాయణపేట మండలంలో 24 పాఠశాలలు ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గంలో కోస్గి, మద్దూర్ మండలాలలు ఉండగా ఆ రెండు మండలాలు కలిపి 51 పాఠశాలలు ఎంపిక చేశా రు. అందులో కోస్గి మండలంలో 23 పాఠశాలలు, మద్దూ ర్ మండలంలో 28 పాఠశాలలు ఉన్నాయి.
రూ.2కోట్లు మంజూరు
జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగం గా ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ రకాలు పనులు చేపట్టేందు కు ప్రభుత్వం రూ.2కోట్లు మంజూ రు చేసింది. అందులో రూ.30లక్షల లోపు నిధులు ఖర్చు అ య్యేవి 106 పాఠశాలలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మొత్తం 52 పాఠశాలలకు 15శాతం నిధుల చొప్పున రూ.76. 36 లక్షలను వివిధ పాఠశాలల అకౌంట్లలో జమ చేశారు.
చేపట్టనున్న పనులు
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ముఖ్యంగా చేపట్టే పనుల్లో తరగతి గదుల్లో విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడం, గోడలకు వివిధ రకాల డిజైన్లతో పెయింటింగ్ వేయించడం, మంచినీటి వసతి సౌకర్యం, మరుగుదొడ్లు నిర్మించడం, కిటికీలు ఏర్పాటు చేయడం, బండలు వేయడం, చెత్తుకు మరమ్మతులు చేయడం, ఫర్నిచర్ ఏర్పాటు, గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటు చేయడం, ఇతర మైనర్, మేజర్ మరమ్మతులు చేయడం లాంటి పనులను చేస్తున్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం నుంచి పనులు చేసేందుకు మొత్తం 149 పాఠశాలలు ఎంపిక చేశారు. అందులో 85 పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణం, 540 మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించడం, 48 కిచెన్ షెడ్లు ఏర్పాటు చేయనున్నారు.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. వసతులు లేని పాఠశాలలను గుర్తించి ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తున్నది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. పాఠశాలలు ప్రారంభం నాటికి పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి.
–వనజాగౌడ్, జెడ్పీ చైర్పర్సన్