అచ్చంపేట, మే 26 : పట్టుదల ఉం టేనే ఏదైనా సాధించవచ్చని, అప్పుడే ఉ న్నత స్థానాలకు చేరుకోవచ్చని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అ న్నారు. గురువారం అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతీ యువకులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు శిక్షకుడిగా మారి మెళకువలు నేర్పించారు. పట్టణంలోని షామ్స్ ఫంక్షన్హాల్లో జీబీఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కోచింగ్ ఇస్తున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ కు ప్రిపేరవుతున్న వారికి మైదానంలో శ రీరదారుఢ్య పరీక్షలో రాణించేందుకు కా వాల్సిన శిక్షణను ప్రారంభించారు.
హైదరాబాద్కు చెందిన నిపుణులను తీసుకొ చ్చి శిక్షణ అందిస్తున్నారు. 1600 మీట ర్ల పరుగుపందెం, లాంగ్జంప్, షాట్ఫుట్లో క్వాలిఫై కావడానికి కావాల్సిన ని బంధనలపై అవగాహన కల్పించారు. యువతులకు మహిళా కోచ్ ద్వారా శిక్ష ణ ఇప్పించారు. ఎన్ని సెకండ్లలో రన్నిం గ్ పూర్తి చేయాలి, షాట్ఫుట్, లాంగ్జంప్ ఎన్ని మీటర్లు వేయాలో వివరించారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు యువకులతో కలిసి రన్నింగ్, ఇతర వ్యా యామాలు ఎలా చేయాలో చేసి చూపించారు. శిక్షకుడిగా మారి అన్నితానై దగ్గరుండి మెళకువలు తెలియజేశారు. ఏఏ రకాల వ్యాయామాలు, ఈవెంట్లు చే యాలో తాను చేస్తూ యువతీ, యువకులకు చూపించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు చెమటోడ్చితేనే రా బోయే రోజుల్లో అనుకున్న రంగంలో రాణిస్తారన్నారు. చిన్న నాటి నుంచి ఎ న్నో కష్టాలు పడి మన కళ్ల ముందు కనిపిస్తున్న వారెందరో జీవితంలో నిలబడ్డారని అన్నారు. ముందుగా లక్ష్యాలు నిర్ధేశించుకొని అటువైపు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జీబీఆర్ చా రిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ స ర్పంచ్ సుదర్శన్, ఆర్డీవో పాండునాయ క్, తాసిల్దార్ కృష్ణయ్య, ఎస్సై ప్రదీప్, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి, కౌన్సిలర్ రమేశ్రావు, విండో డైరెక్టర్ శ్రీనివాసులు, ఖలీల్, లింగం, యువతీయువకులు పాల్గొన్నారు.