వనపర్తి టౌన్, మే 26: ఆజాదీకా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకొని గత నెల లో తానా ఆధ్వర్యంలో అంతర్జాతీయ గేయ క వితా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వనపర్తి పట్టణానికి చెందిన ఉపాధ్యాయురాలు ఒలి పె సత్యనీలమ్మ ఎంపికైనట్లు నిర్వాహకులు అంజయ్యచౌదరి, శ్రీనివాస్, డాక్టర్ ప్రసాద్ తె లిపారు. 27, 28, 29వ తేదీల్లో దేశవ్యాప్తంగా ఈ పోటీలకు ఎంపికైన 81 మంది కవులు జూ మ్ సమావేశంలో తమ కవితాగానం చేయనున్నారు. భారత్ కాలమానం ప్రకారం సత్యనీల మ్మ 28న సాయంత్రం 6:30 గంటలకు తాను రాసిన ‘అమ్మ ప్రేమ’ గేయాన్ని ఆలపించబోతున్నారని చెప్పారు. సత్యనీలమ్మ ఇప్పటికి మూడు కవితా సంపుటాలను ప్రచురించగా.. జిల్లా, రా ష్ట్ర స్థాయి కార్యక్రమాలలో పాల్గొని అవార్డులు పొందారు. సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు శంకర్గౌడ్, సాహితీవేత్తలు నారాయణరెడ్డి, జనజ్వాల, చంద్రశేఖర్, శ్యాంసుందర్, శ్రీనివాసు లు హర్షం వ్యక్తం చేశారు.