మహబూబ్నగర్, మే 12 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : స్థిరాస్తి కొనుగోలుదారులకు శుభవార్త.. శని, ఆదివారాల్లో పాలమూరులోని సుదర్శన్ ఫంక్షన్హాల్లో తొలిసారిగా ప్రాపర్టీ షో నిర్వహించనున్నారు. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో జరగనున్నది. ఒకే వేదికపై ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్యాంక్ అధికారులు, నిర్మాణ సంస్థలు కొలువుదీరనున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసే స్టాళ్లలో కొనుగోలుదారులకు వాటికి సంబంధించిన ధరలు, వడ్డీ, ఇతర వివరాలను వ్యాపారులు, అధికారులు తెలియజేస్తారు. కస్టమర్లకు కొన్ని సంస్థలు ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ప్రకటించనున్నాయి. దీంతో మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, భూత్పూర్, ఎర్రవల్లి చౌరస్తా ప్రాంతాల్లో ఉన్న మన్నికైన గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలను సరసమైన ధరల్లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉన్నది. ఇక నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కనున్నది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత మహబూబ్నగర్ దశ మారిపోతున్నది. ఒకప్పుడు మహబూబ్నగర్ అంటే వామ్మో అనే వాళ్లు.. ఇప్పుడు ఈ ప ట్టణం పేరు చెబితే వావ్ అనేలా అభివృద్ధి చెందుతున్నది. జడ్చర్ల నుంచి దేవరకద్ర రోడ్డు వరకు, భూత్పూరు నుంచి కోయిలకొండ చౌరస్తా వర కు పట్టణం నలువైపులా విస్తరిస్తున్నది. పెరుగుతున్న జనాభాతోపాటు పట్టణానికి వలస వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్న వారితో మహబూబ్నగర్ కళకళలాడుతున్న ది. ఈ తరుణంలో పట్టణంలో కొత్తగా ని ర్మాణాలు భారీగా పెరుగుతున్నాయి. స్థలా లు, అపార్ట్మెంట్లకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చేసింది. కొత్తగా విల్లాల సంస్కృతి సై తం పాలమూరును తాకింది. ఉద్యోగులు, వ్యాపారులు మహబూబ్నగర్లో స్థిర ని వాసం ఏర్పాటు చేసుకునేందుకు ఉత్సా హం చూపిస్తున్నారు. కొత్త కొత్త నిర్మాణాలు ఊపందుకుంటూ మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీ కలిసి ఓ వలయంగా మారిపోయాయి.
ఈ మూడు పట్టణాలు వేరు వేరు మున్సిపాలిటీలుగా ఉన్నా.. దాదాపుగా కలిసిపోయినట్లుగా మారాయి. ఇండ్లు, స్థలాలు, అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలకు ఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్గా మారింది. ఈ తరుణంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో మహబూబ్నగర్ పట్టణంలోని సుదర్శన్ ఫంక్షన్ హాల్లో ప్రాపర్టీ షో జరుగుతున్నది. ఇందులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ స్థిరాస్తి సంస్థలు పాల్గొంటున్నాయి. 14న ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ షోలోకి ప్రవేశం ఉచితం. ప్రాపర్టీ షోలో పాల్గొంటున్న సంస్థలు తమ ప్రతినిధులను అందుబాటులో ఉంచి వినియోగదారులకు వారి సంస్థ స్థలాలు, అపార్ట్మెంట్లు, గృహాలు, విల్లాలకు సంబంధించిన పూర్తి వివరాలు, ధరలు వివరిస్తారు.
నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షో సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేకమైన డిస్కౌంట్లు కూడా అందచేయనున్నట్లు రియల్ ఎస్టేట్ సంస్థలు తెలిపాయి. కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, భూత్పూర్, ఎర్రవల్లి చౌరస్తా వంటి చోట్ల ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలను సరసమైన ధరల్లో కొనుగోలు చేసే అవకాశం ఉన్నది.
బ్యాంకులు సైతం..
ఈ ప్రాపర్టీ షోకు హాజరై అక్కడికక్కడే నచ్చిన ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు అందుబాటులో ఉండేలా వివి ధ బ్యాంకుల ప్రతినిధులు సైతం ఈ ప్రదర్శనకు వ స్తున్నారు. బ్యాంకులు సైతం స్టాల్స్ ఏర్పాటు చేసుకుని వినియోగదారులకు గృహ రుణాలు ఇచ్చేందు కు సిద్ధంగా ఉండనున్నారు. వడ్డీ రేట్లు, ఈఎంఐ తదితర వివరాలు కూడా వినియోగదారులకు బ్యాంకు ల ప్రతినిధులు వివరిస్తారు. స్థిరాస్తి సంస్థలు, బ్యాంకులు ఒకేచోట కొలువుదీరడంతో వినియోదారులకు కూడా అనుమానాలు నివృత్తి చేసుకునేందు కు సరైన వేదిక లభించనున్నది.
సొంతింటి కల చెదరకుండా చూడాలి..
ఒకప్పుడు వెనకబడిన జిల్లాగా ఉన్న మహబూబ్నగర్ వ్యవసా యం, స్థిరాస్తి వ్యాపార రంగాల్లో ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందుతున్నది. అయితే చాలా మంది అక్రమ లే అవుట్లతో వినియోగదారులను మోసం చేస్తున్నా రు. చాలామంది సొంతింటి కల కోసం జీవితకాలం కష్టపడతారు. రెక్కలు ముక్కలు చేసుకొని నోరు కట్టుకొని సంపాదిస్తారు. మాకు ఓ గూడు ఉండాలనే ప్రతి ఒక్కరి ఆకాంక్షకు ఆ కష్టం అనేది ప్రతిరూపం. అయితే కొందరు ఇల్లీగల్ లే అవుట్లు, అనుమతుల్లో అవకతవకల వల్ల ఆ స్థలం, ఇళ్లు కొన్న వినియోగదారులు జీవితకాలం ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. సరైన అనుమతులు లేని ప్రాపర్టీలు కొని అనేక మంది 15, 20 ఏండ్లపాటు ఈఎంఐలు కడుతూ ఆవేదనకు గురవుతుంటారు. ఇలాంటి వ్యాపారులపై ప్రభుత్వం కఠినంగా ఉండాలి. డీటీసీపీ లే అవుట్, ఎలాంటి వివాదాలు లేని స్థలాలు, అనుమతి ఉన్న ఇండ్లు మాత్రమే విక్రయించేలా రియల్ ఎస్టేట్ సంస్థలపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి.
అక్రమాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం వినియోగదారుడి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ప్రతి ఒక్క సంస్థ అన్ని జాగ్రత్తలు తీసుకుని నాణ్యతతోపాటు అన్ని అనుమతులతోనే ఇంటి నిర్మాణాలు చేపట్టాలి. అప్పుడే ఆ సంస్థను నమ్ముకున్న వినియోగదారుడు బాగుంటాడు. ఆ సంస్థకు సైతం మంచి పేరు వస్తుంది. మంత్రి శ్రీనివాస్గౌడ్ పట్టణ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఇదే స్థాయిలో అభివృద్ధి జరుగుతూ పోతే భవిష్యత్తులో హైదరాబాద్ స్థాయి నగరంగా మారుతుంది. మహీంద్రా, మారుతి, టీవీఎస్ బ్రాండ్లతో గత 40 ఏండ్ల నుంచి కూడా మేం వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. శ్రీరామ ల్యాండ్ మార్క్ పేరుతో రియల్ ఎస్టేట్ రంగంలోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నాం.
అన్ని అనుమతులు, అత్యంత నాణ్యతతో కూడిన నిర్మాణాలకు మేం కేరాఫ్ అడ్రస్గా ఉన్నాం. ఇప్పటికే 36 విల్లాలు నిర్మించాం. వాటన్నింటా గృహ ప్రవేశాలు కూడా జరిగాయి. ప్రస్తుతం 18 విల్లాల పనులు జరుగుతున్నాయి. ఒక అపార్ట్మెంట్ పూర్తి చేయగా.. మరోటి త్వరలో ప్రారంభిస్తున్నాం. రెండో దశలో 200 విల్లాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాం. సకల సదుపాయలతో వినయోగదారుడు జీవితకాలం సంతోషంగా ఉండేలా నిర్మాణాలు చేయడమే మా విజన్. త్వరలో మాల్స్, హోటల్, ఇతర సదుపాయాలు అందుబాటులోకి తెస్తాం. మౌలిక వసతులు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం.
– బెక్కరి రామిరెడ్డి, క్రెడాయి మహబూబ్నగర్ ఛాప్టర్ చైర్మన్, శ్రీరామ జయరామ గ్రూప్ చైర్మన్