ఇటిక్యాల, మే 12 : బీచుపల్లి క్షేత్రానికి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకున్నది. నడిగడ్డ భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న అంజన్న స్వామి ఉత్సవాలు 14న ప్రారంభంకానున్నాయి. కృష్ణానది తీరంలో.. జాతీయ రహదారి-44కు సమీపంలో.. ఆహ్లాదకర వాతావరణంలో.. ఐదు రోజులు నిర్వహించే వేడుకలకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. 16న పెద్ద రథోత్సవం జరగనుండగా.. పల్లకీ సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఆంజనేయస్వామి ఆలయంలో వాల్మీకులే పూజారులు. భక్తులు వేలాదిగా తరలొచ్చి కొత్త కుండల్లో కుడుములు తయారు చేసినైవేద్యంగా పెట్టనున్నారు.
నడిగడ్డ భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న బీచుపల్లి రాయుడు(అంజన్న) బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తిచేసింది. జోగుళాంబగద్వాల జిల్లాలోని 44వ జాతీయ రహదారి ఇటిక్యాల వద్ద బీచుపల్లిక్షేత్రంలో ఈ నెల 14వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగనున్నాయి. చారిత్రక ప్రా ధాన్యత గల బీచుపల్లి క్షేత్రం (నడిగడ్డ)కృష్ణాతీరాన ఆహ్లాదకర వాతావరణంలో భక్తులకు అందుబాటులో ఉన్నది. 16వ శతాబ్దంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని వ్యాసరాయలవారు ప్రతిష్ఠాపించినట్లు చరిత్ర చెబుతున్నది. శ్రీకృష్ణదేవరాయల గురువు వ్యాసరాయలకు స్వామివారు కలలో రావడంతో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు భక్తుల నమ్మకం. స్వామివారిని మొదటగా వాల్మీకి(బోయ) కులానికి చెందిన బీచుపల్లి అనే వ్యక్తి దర్శించుకోవడంతో అతడి పేరుమీదనే బీచుపల్లిక్షేత్రంగా ప్రసిద్ధిచెందినది. అప్పటినుంచి వాల్మీకి(బోయ) వంశస్తులే పూజారులుగా ఉంటూ పూజలు చేస్తున్నారు. వైదోక్త పూజార్చనకు ఇనాములిచ్చి నియమింపబడి న బ్రాహ్మణులూ ఉన్నారు.
భక్తి విశిష్టత..
స్వామివారికి మొక్కులు చెల్లించకుంటే సంతానం కలుగుతుందని, భూతప్రేత గ్రహపిశాచా లు తొలగిపోతాయని భక్తుల న మ్మకం. స్వామివారి పై ఉన్న అపారమైన భక్తికి నిదర్శనంగా ఇక్కడి వారు తమ పిల్లలకు బీచుపల్లి, బీసమ్మ, బీసన్న తదితర పేర్లు పెట్టడం ఆనవాయితీ. ఆహ్లాదకరమైన వాతావరణం, జాతీయ రహదారి సౌకర్యం, వివాహాలకు కావాల్సిన ఏర్పాట్లు ఉండటంతో ఈ క్షేత్రం వివాహాలకు వేదికగా విరాజిల్లుతోంది. జాతర ప్రా రంభమైన నాటి నుంచి నెలరోజులపాటు భక్తుల సందడితో ఆలయాలు కిటకిటలాడుతాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే భక్తులతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు సమర్పించుకుంటారు. కొత్తకుండలో చేసిన కుడుములను స్వామికి నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత.
బ్రహ్మోత్సవ కార్యక్రమాలు..
14న పంచామృతాభిషేకం, వాస్తుపూజ వా స్తుహోమం, అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణం, రాత్రికి తెప్పోత్సవం, 15న పంచామృతాభిషేకం, స్వామివారికి ఉపనయనం, రాత్రికి ప్రభోత్సవం, 16న పంచామృతాభిషేకం, వ్యాసపూజ, సీతారాముల క ల్యాణం, బలిహరణం, రథంగహో మం, కుంభం, రాత్రికి రథోత్సవం (పెద్దతేరు), 17న పంచామృతాభిషేకం, ప్రభోత్సవం, 18న అమృతస్నానం, రాత్రికి పల్లకీసేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తా యి.