శ్రీశైలం, మార్చి 11 : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సోమవారం భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై ఆశీనులను చేసి పూజ లు చేశారు. సాయంత్రం వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో అక్కమహాదేవి మండపంలో శాస్ర్తోక్తపూజలతో ఆలయోత్సవం నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.
అమ్మవారి కి ప్రీతికరమైన కాగడాలు, ఎర్రగులాబీలు, తెల్లచామం తి, ఊదా చామంతి, మందారం, లిల్లీ, ఎర్రగన్నేరు, ఊదగన్నేరు, దేవగన్నేరు, నందివర్ధనం, గరుడవర్ధనం, తెల్లచామంతి వంటి 21 రకాల ప్రత్యేక పుష్పాలను స్వామి, అ మ్మవార్లకు సమర్పించడంతోపా టు జామ, ఖర్జూర, నల్లద్రాక్ష వం టి 9 రకాల పండ్లతోపాటు బిల్వం, మరువం, మాచీపత్రితో ప్రత్యేక అలంకరణ చేసిన శయనమందిరంలో భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లకు ఏకాంతసేవగా శయనోత్సవాన్ని నిర్వహించినట్లు ఈవో తెలిపారు.