వెల్దండ, మార్చి 2 : పార్లమెంట్ ఓట్ల కోసమే కాంగ్రెస్ మేడిగడ్డ, ఇతర ప్రాజెక్టులను సందర్శిస్తూ డ్రామాలాడుతున్నదని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మోసగిం చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా సమస్యలను గాలికొదిలేసి పర్యటనలకే పరిమితమైందన్నారు. కుం గిన కాలేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లను సరిచేసి రైతులకు నీళ్లివ్వకుండా రాద్ధాంతం చేస్తూ కష్టాలకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం పెంపు, వృద్ధులు, దివ్యాంగులకు పింఛ న్ల పెంపు ఇంత వరకు ఊసేలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 10 శాతం పనులు పూర్తయితే ఉమ్మడి జిల్లాకు సాగునీరు అందించొచ్చని, అది వదిలేసి ప్రాజెక్టుల పర్యటనలు చేస్తూ టైంపాస్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వంలో పదేండ్లలో రైతులు ఎలాంటి కష్టం లేకుండా సంబురంగా సాగు చేశారన్నారు. 90 శాతం చేపట్టిన ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.
వ్యవసాయరంగంలో తెలంగాణ ఎన్ని అద్భుతాలు సృష్టించిందో కేంద్ర ప్ర భుత్వం ఇచ్చిన అవార్డులను చూస్తే తెలుస్తుందన్నారు. ఆరు గ్యారెంటీల పేరిట అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారని, మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుల సాకుతో ప్రజల దృష్టి మళ్లించేందుకు మేడిగడ్డను బూచీగా చూపుతూ ఓట్ల కోసం రైతుల జీవితాలతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పరీక్షల ఫలితాలు రాకుండా అప్పట్లో కేసు లు వేసి అడ్డుకున్న వీరు.. నేడు అధికారంలోకి వచ్చా క అవే ఉద్యోగాలు ఇస్తూ తామే ఇచ్చినట్లు చెప్పుకోవడం దౌర్భాగ్యకరమన్నారు. ఎన్నికల్లో మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఉద్యమ పార్టీకి పట్టం క ట్టాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, సింగిల్విండో డైరెక్టర్ శేఖర్, నాయకులు జంగయ్య, మధుసూదన్రెడ్డి, నిరంజన్, వెంకటయ్య, జగదీశ్వర్, ఆనంద్, జో గయ్య, బొజ్జయ్య, హన్మంతునాయక్, తిర్మల్రావు, ప్రసాద్, శేఖర్, ప్రవీణ్, రవికుమార్గౌడ్, శ్రీను, తిరుపతయ్యయాదవ్, శ్రీను, శివ పాల్గొన్నారు.