గద్వాల అర్బన్, మార్చి 28 : తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడి అందినకాడికి దోచుకెళ్లిన ఘట న జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. బాధితుడి కథనం మేరకు.. జిల్లా కేంద్రానికి చెందిన రాజేశ్ వ్యక్తిగత పని నిమిత్తం తన కుటుంబసభ్యులతో కలి సి రెండురోజుల కిందట బెంగళూరుకు వెళ్లాడు. ఈక్రమంలో ఇంటి పరిసరాలను పరిశీలించిన దొంగలు ఎవరూ లేని సమయంలో తాళం వేసిన ఇం ట్లోకి చొరబడి రూ.10లక్షల నగదు, 30 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. గురువారం తిరిగొచ్చి న రాజేశ్ ఇంటి తాళం తెరిచి ఉండడం తో లోపలికి వెళ్లి దొంగతనం జరిగినట్లు గ్రహించాడు. వెంటనే సమాచా రం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీం సహాయం తో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై శ్రీనివాస్ పేర్కొన్నారు.