నాగర్కర్నూల్, జూన్ 1 : ఈ సారి బడ్జెట్లో రైతు రుణమాఫీకి నిధులు కే టాయిస్తామని, వానకాలం రైతుబంధు ను ఖాతాల్లో జమచేసిన తరువాత రుణమాఫీ ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపా రు. మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవా డ సుఖజీవన్రెడ్డి గార్డెన్లో దశాబ్ది ఉత్సవాల సన్నద్ధతపై గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న రాష్ట్రంలో విజయాలు, అద్భుత ప్రగతిని నేటి తరానికి కండ్లకు కట్టినట్లు చూపించడమే దశాబ్ది ఉత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సాధించిన ప్రగతిని నేటి యువతరానికి అవగాహన కల్పించేందుకు వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఆయా శాఖలు సాధించిన విజయాలతో దేశంలోని మొదటి మూడు స్థానా ల్లో నిలిచిన విషయాన్ని వివరించాలన్నారు. జూన్ 3న అన్ని రైతు వేదికలను తోరణాలతో అలంకరించి వేడుకలు ని ర్వహించాలన్నారు. చుట్టుపక్క ప్రాంతా ల నుంచి ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు కట్టుకొని డప్పులు, బ్యాండ్ బాజాలతో రై తువేదికల వద్దకు ర్యాలీగా చేరుకోవాలన్నారు. జూన్ 2న ఆవిర్భావ దినోత్స వం నుంచి 22వ తేదీ వరకు ఒక్కోశాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించాలన్నారు. జిల్లా అధికారులు ఎక్కడికక్కడ వేదికలను ఏర్పాటు చేయాలని, మౌలిక సదుపాయాలు, టెంటు, షామియానా, కుర్చీలు, ఫ్లెక్సీలు, నీరు, భోజన సదుపాయాలు వంటి వాటిపై ముందుగా అవగాహన కల్పించాలన్నారు.
ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ప్రణాళికాబద్ధం గా కార్యక్రమాలు నిర్వహించాలని సూ చించారు. ఎంపీ రాములు మాట్లాడు తూ తొమ్మిదేండ్ల కాలంలో సాధించిన విజయాలను నేటి యువతరానికి తెలియజేయాలన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించినందున మన ఊరు-మనబడిపై కూడా ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గు వ్వల బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, కలెక్టర్ ఉదయ్కుమార్, ఎస్పీ మ నోహర్, అదనపు కలెక్టర్లు మనూచౌద రి, మోతీలాల్, ఇరిగేషన్ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంతురావు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, స ర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.